ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డిజిట‌ల్ లిట్ర‌సి కార్య‌క్ర‌మం


డిజిట‌ల్ తెలంగాణలో భాగంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 10,000మంది న‌గ‌ర‌వాసుల‌కు డిజిట‌ల్ లిట‌ర‌సిపై ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వ‌ర‌కు న‌గ‌రంలోని 28 మురికివాడ‌ల్లో  10,000మందిని డిజిట‌ల్ లిట‌ర‌సిపై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. రోజువారి కార్య‌క‌లాపాల్లో డిజిట‌ల్ టెక్నాల‌జిని ఉప‌యోగించుకోవ‌డం ద్వారా మ‌రింత సుల‌భ‌త‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డిపేందుకుగాను ప్ర‌తిఒక్క‌రిలో డిజిట‌ల్ లిట్ర‌సిని పెంపొందించేందుకుగాను కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ ఇన్ ఇండియా అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ తెలంగాణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇందుకుగాను 10,000మంది న‌గ‌ర‌వాసుల‌కు డిజిట‌ల్ లిట‌ర‌సిని క‌ల్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ఇంగ్లీష్‌, హిందీ లేదా తెలుగు భాష‌ల్లో నిర్వ‌హించే ఈ శిక్ష‌ణ కార్య‌క్రమాన్ని న‌గ‌రంలోని 28కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న‌ట్టు, ఒక్కో కేంద్రంలో 200మందికి శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ఈ శిక్ష‌ణ పొందేందుకు గాను 14నుండి 60సంవ‌త్స‌రాలలోపు ఉండి ఐటి ప‌రిజ్ఞానంలేని వారు అర్హుల‌ని తెలిపారు. ఇందుకుగాను 28మందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను కూడా ఐటి విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సురేంద్ర‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ క్రింది వాటిలో ఐటి నిర‌క్ష‌రాసుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. 1. కీబోర్డు నిర్వ‌హ‌ణ పై శిక్ష‌ణ‌, 2. గూగుల్‌మ్యాప్‌ను గుర్తించ‌డం, 3. ఈ-మెయిల్ ఐడిలను క్రియేట్ చేయ‌డం, 4. ఫోటోలు, స‌మాచారాన్ని భ‌ద్ర‌ప‌ర్చుకోవ‌డానికై డిజిట‌ల్ లాక‌ర్ల‌ను క్రియేట్ చేయ‌డం, 5. ఈ-మెయిల్ చ‌ద‌వ‌డం, రిప్లే పంప‌డం, 6. ఆన్‌లైన్ ద్వారా వార్త ప‌త్రిక‌ల‌ను చ‌ద‌వ‌డం, 7. రైల్వే స‌మాచారాన్ని తెలుసుకునేవిధంగా ఐఆర్‌సిటిసికి రిజిస్ట్ర‌ర్ చేసుకోవ‌డం, 8. స్కైప్‌పై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, 9. విక్కీపిడియా, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్‌ల ద్వారా స‌మాచారం తెలుసుకోవ‌డం, 10. ఆధార్ లింక్ ద్వారా స‌మాచారాన్ని పొంద‌డం త‌దిత‌ర అంశాల‌ను ఈ డిజిట‌ల్ లెట్ర‌సి ప్రోగ్రాం ద్వారా క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. ఎంపిక చేసిన 28 ప్రాంతాల్లో జీహెచ్ఎంసి క‌మ్యునిటిహాల్ డిజిట‌ల్ లిట్ర‌సి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..