ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డిజిట‌ల్ లిట్ర‌సి కార్య‌క్ర‌మం


డిజిట‌ల్ తెలంగాణలో భాగంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 10,000మంది న‌గ‌ర‌వాసుల‌కు డిజిట‌ల్ లిట‌ర‌సిపై ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వ‌ర‌కు న‌గ‌రంలోని 28 మురికివాడ‌ల్లో  10,000మందిని డిజిట‌ల్ లిట‌ర‌సిపై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. రోజువారి కార్య‌క‌లాపాల్లో డిజిట‌ల్ టెక్నాల‌జిని ఉప‌యోగించుకోవ‌డం ద్వారా మ‌రింత సుల‌భ‌త‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డిపేందుకుగాను ప్ర‌తిఒక్క‌రిలో డిజిట‌ల్ లిట్ర‌సిని పెంపొందించేందుకుగాను కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ ఇన్ ఇండియా అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ తెలంగాణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇందుకుగాను 10,000మంది న‌గ‌ర‌వాసుల‌కు డిజిట‌ల్ లిట‌ర‌సిని క‌ల్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ఇంగ్లీష్‌, హిందీ లేదా తెలుగు భాష‌ల్లో నిర్వ‌హించే ఈ శిక్ష‌ణ కార్య‌క్రమాన్ని న‌గ‌రంలోని 28కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న‌ట్టు, ఒక్కో కేంద్రంలో 200మందికి శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ఈ శిక్ష‌ణ పొందేందుకు గాను 14నుండి 60సంవ‌త్స‌రాలలోపు ఉండి ఐటి ప‌రిజ్ఞానంలేని వారు అర్హుల‌ని తెలిపారు. ఇందుకుగాను 28మందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను కూడా ఐటి విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సురేంద్ర‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ క్రింది వాటిలో ఐటి నిర‌క్ష‌రాసుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. 1. కీబోర్డు నిర్వ‌హ‌ణ పై శిక్ష‌ణ‌, 2. గూగుల్‌మ్యాప్‌ను గుర్తించ‌డం, 3. ఈ-మెయిల్ ఐడిలను క్రియేట్ చేయ‌డం, 4. ఫోటోలు, స‌మాచారాన్ని భ‌ద్ర‌ప‌ర్చుకోవ‌డానికై డిజిట‌ల్ లాక‌ర్ల‌ను క్రియేట్ చేయ‌డం, 5. ఈ-మెయిల్ చ‌ద‌వ‌డం, రిప్లే పంప‌డం, 6. ఆన్‌లైన్ ద్వారా వార్త ప‌త్రిక‌ల‌ను చ‌ద‌వ‌డం, 7. రైల్వే స‌మాచారాన్ని తెలుసుకునేవిధంగా ఐఆర్‌సిటిసికి రిజిస్ట్ర‌ర్ చేసుకోవ‌డం, 8. స్కైప్‌పై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, 9. విక్కీపిడియా, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్‌ల ద్వారా స‌మాచారం తెలుసుకోవ‌డం, 10. ఆధార్ లింక్ ద్వారా స‌మాచారాన్ని పొంద‌డం త‌దిత‌ర అంశాల‌ను ఈ డిజిట‌ల్ లెట్ర‌సి ప్రోగ్రాం ద్వారా క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. ఎంపిక చేసిన 28 ప్రాంతాల్లో జీహెచ్ఎంసి క‌మ్యునిటిహాల్ డిజిట‌ల్ లిట్ర‌సి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు