ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వసూళ్లను పటిష్ట0... ఎగవేత ఫై కఠినం

మూస పద్దతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి, వాణిజ్య పన్నులశాఖ వ్యవస్థను, వసూళ్లను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సరిగా పన్నులు కట్టేవారికి ప్రోత్సాహకంగా, పన్నులు ఎగవేసేవారి పట్ల కఠినంగా, బాగా పనిచేసే అధికారుల వెన్నుతట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని సూచించారు. 
రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య శాఖను పటిష్టం చేసుకోవాలని, అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలని, వెంటనే పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావాల్సినంత ఆదాయం పూర్తిస్థాయిలో వస్తుందా? లేదా? అనే అంశాన్ని శాస్త్రీయంగా బేరీజు వేసుకోవాలని చెప్పారు. వంద శాతం పన్నులు వసూలయ్యే విధానం అమలు చేయాలని సూచించారు. చిత్తశుద్దితో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని, పన్నులు సక్రమంగా చెల్లించే వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
రూ. 3,600 కోట్ల రూపాయల బకాయిలు కోర్టు వివాదాల్లో వున్నాయని, ఆ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్పోరేషన్ల ద్వారా జరిపే కొనుగోళ్ల సందర్భంగా టిడిఎస్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. పదవి విరమణ చేసే అధికారుల సేవలను, అనుభవాలను ఉపయోగించుకోవాలని సూచించారు.ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయం ద్వారా రాష్ట్రంలో అనేక కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, ఫలితంగా పన్నులు మరింత ఎక్కువ వచ్చే అవకాశం వుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రేవతి రోహిణి, అడిషనల్ కమిషనర్ కె. చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..