ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వసూళ్లను పటిష్ట0... ఎగవేత ఫై కఠినం

మూస పద్దతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి, వాణిజ్య పన్నులశాఖ వ్యవస్థను, వసూళ్లను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సరిగా పన్నులు కట్టేవారికి ప్రోత్సాహకంగా, పన్నులు ఎగవేసేవారి పట్ల కఠినంగా, బాగా పనిచేసే అధికారుల వెన్నుతట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని సూచించారు. 
రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య శాఖను పటిష్టం చేసుకోవాలని, అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలని, వెంటనే పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావాల్సినంత ఆదాయం పూర్తిస్థాయిలో వస్తుందా? లేదా? అనే అంశాన్ని శాస్త్రీయంగా బేరీజు వేసుకోవాలని చెప్పారు. వంద శాతం పన్నులు వసూలయ్యే విధానం అమలు చేయాలని సూచించారు. చిత్తశుద్దితో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని, పన్నులు సక్రమంగా చెల్లించే వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
రూ. 3,600 కోట్ల రూపాయల బకాయిలు కోర్టు వివాదాల్లో వున్నాయని, ఆ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్పోరేషన్ల ద్వారా జరిపే కొనుగోళ్ల సందర్భంగా టిడిఎస్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. పదవి విరమణ చేసే అధికారుల సేవలను, అనుభవాలను ఉపయోగించుకోవాలని సూచించారు.ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయం ద్వారా రాష్ట్రంలో అనేక కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, ఫలితంగా పన్నులు మరింత ఎక్కువ వచ్చే అవకాశం వుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రేవతి రోహిణి, అడిషనల్ కమిషనర్ కె. చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.