ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిజిటల్ అరెస్ట్,రిటైర్డ్ జడ్జీనే టార్గెట్ చేసి రూ.1.66 కోట్ల టోకరా..*

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌ల పేరిట అమాయకులను ముంచేస్తున్నారు. చదువుకున్న వ్యక్తులు సైతం ఈ డిజిటల్ అరెస్ట్‌లకు బలవుతున్నారు. సైబర్ కేటుగాళ్లు ఈ సారి ఏకంగా రిటైర్డ్ జడ్జీని టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా దోచేశారు. సైబర్ మోసగాళ్లు వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని చెప్పి రిటైర్డ్ జడ్జిని భయపెట్టారు. మీపై విచారణ జరుగుతోందని, కేసు ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తూ డిజిటల్ అరెస్ట్ చేసినట్టు నటించారు. అంతేకాకుండా మీ ఆధార్‌కు లింక్ అయిన రెండు మొబైల్ నెంబర్లు మహిళలకు అభ్యంతరకర కాల్స్ చేస్తున్నాయని చెబుతూ మాజీ జడ్జిని భయభ్రాంతులకు గురిచేశారు.దర్యాప్తు కోసం మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి, మీరు చెల్లించే మొత్తం విచారణ పూర్తయ్యాక తిరిగి ఇస్తామని నమ్మబలికారు. అరెస్టు అయితే ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందనే భయంతో రిటైర్డ్ జడ్జి మొత్తంగా రూ.1.66 కోట్లు సైబర్ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. అయితే మోసగాళ్లు చెప్పినట్లుగా నగదు తిరిగి ఇవ్వకపోవడంతో మోసం జరిగినట్టు గ్రహించిన రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించారు....
ఇటీవలి పోస్ట్‌లు

సీనియర్ నేత కావూరి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYD ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మచిలీపట్నం, ఏలూరు నుంచి 5 సార్లు ఎంపీగా విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరినా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

హోలీ .. ప్రత్యేక ట్రింపులు

 హోలీ పండుగ దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని అంచనా వేస్తూ ఈ నెల 25 నుంచి మార్చి 18 వకు వివిధ జోన్లలో 12 వందల 44 హోలీ ప్రత్యేక ట్రిప్పులను నడిపేందుకు సిద్దమైంది. 

కేరళ -2 సినిమా కు బ్రెక్

  కేరళ స్టోరీ -2 సినిమా పై కేరళ హైకోర్టు స్టే విధించింది.సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని హైకోర్టు తెలిపింది. సెన్సార్ బోర్డు  తీరుపై అగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సరిగా చూడకుండానే అనుమతి ఇవ్వడం కోర్టు సిరియస్ అయింది.

విజయ్,రష్మిక పెళ్లి.... రెండు సార్లు

  విజయ్ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో లను రష్మిక అభిమానులతో పంచుకుంటూ హాయ్ మై లవర్స్.... నా భర్త విజయ్ దేవరకొండ ను మీకుకు పరిచయం చేస్తున్నా  అని పొస్ట్ చేసింది. విజయ సంప్రాదయ ప్రకారం ఉదయం , తర్వాత రష్మిక సంప్రాదయం ప్రకారం వివాహం జరిగింది

మోదీ మరో అరుదైన ఘనత

  ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత  సాధించారు. సోషల్ మీడియా లో  ప్రపంచంలోనే అత్యంత ఫాలో వర్లు ఉన్న పొలిటికల్ లీడర్ గా నిలిచారు 2014 లో మోదీ ఇన్ స్టాగ్రామ్ వినియోగించడం ప్రారంభించిన ఆయన 4 కోట్ల 30లక్షల  మంది ఫాలో వర్లతో ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు.

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది