ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం - నాణెం పై తెలుగు భాష

 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య  సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో పట్టాభి సీతారామయ్య  ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య  ను సభ దృష్టి ముందు పెట్టారు. పట్టాభీ.. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ?  మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గాంధీ  మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఎగతాళిగా మాట్లాడారు.  వెంటనే పట్టాభి సీతారామయ్య  తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష .. ఆంగ్లంలో జాతీయ భాష  హిందీలో, దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలో ఉంది. ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే  అంటూ చురక వేశారు.తెలుగు మాతృ బాషా కాని వారు ఆశ్చర్యపోయారు.భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను ...
ఇటీవలి పోస్ట్‌లు

పిడుగుతో ఇల్లు గోవిందా

  సాదారణంగా వర్షకాలంలో వరదలతో నాళలు పొంగి నీటి ప్రవాహంలో జనాలు కొట్లకుపొవటం కు సంబంధించిన వార్తలను చూస్తుంటాం. కానీ ఇదే వర్ష కాలం ఇంకో ప్రమాదం గురించి ఎక్కువగా ఆలోచించం అదే పిడుగు... భారీ శబ్దంతో పాటు సుమారు లక్ష నుంచి రెండు లక్షల వోల్టు లకు పైగా విద్యుత్తు...పిడుగు నేల ను తాకే సమయంలో ఉత్పత్తవుతుంది. పిడుగు తీవ్రతకు ఇంటి వస్తువులతో పాటు ఇల్లు కూడా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కనీస జాగ్రతలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా  కాపాడుకునే వీలుందంటున్నారు నిపుణులు.  వర్షాకాలంలో వరద బీభత్సం మే కాదు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువైతున్నాయి.  ఉత్పతాల సమయంలో  ఎత్తయిన భవనా పై అంతస్తుల్లో ఉండేవారు  విద్యుత్తు సరఫరా అందించే మెయిన్ స్విచ్ ను ఆపేయాసి, టీవీ, ఏసీ, ప్రజ్, వాషింగ్ మెషిన్  సహా అన్ని విద్యత్తు గృహోపరకరణాల ప్లగ్  లను స్విచ్  బోర్డు  నుంచి తీసేయాలి. సాధారణ ఇళ్ల నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకూ అన్నింటిని రాగి తీగతో ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలి.ఇంటి పై కప్పు పై రాగితో  చేసిన లైటినింగ్ అరెస్టర్. లైటనింగ్ కండక్టర్  ను బిగించుకుని., వాటిని ఎ...

శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరు. కుటుంబ కథా చిత్రాలు, సాంఘిక చిత్రాలు, సాహిత్య ఆధారిత పాత్రల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. Manushulu Marali , Jeevana Tarangalu , Soggadu , Karthika Deepam , Devatha , Gorintaku , Mundadugu వంటి చిత్రాలు ఆయన నటనకు చిరస్మరణీయ ఉదాహరణలు.తెలుగు కుటుంబ కథా చిత్రాలకు హుందాతనం, గౌరవం, భావోద్వేగాలను అందించిన మహానటుడు శోభన్ బాబు. ఆయన నటన, వ్యక్తిత్వం, విలువలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి.  శోభన్ బాబు తెలుగు రాష్ట్రాలలో తెలియనివారుండరు. శోభన్ బాబు కు మహిళ ప్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చెన్నైలో నివాసం ఉంటున్న శోభన్ బాబు భార్య శాంతకుమారి జులై 9 , వయోభారంతో మృతి చెందారు.మే 15 1958లో శోభన్‌బాబుకు శాంతకుమారితో వివాహం,ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు

ఇండియా క్యాన్సర్ క్యాపిటల్

  క్యాన్సర్ క్రమంగా భారతదేశంలోపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా ఏడాదకి రెండు కొట్లకుపైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదౌతుంటే..ఆ రోగంతో దాదాపు కొటి  మంది మరణిస్తున్నారని డబ్ల్యూ హెచ్ వో వెల్లడించింది.క్యాన్సర్ పీడిత దేశల్లో చైనా,ఆమెరికా తర్వాత మూడో స్ధానంలో భారత దేశం ఉండటం  తీవ్ర కలవరపరుస్తోంది. తాజా గ్లోబోకాన్ అంచనాల ప్రకారం, దాదాపు పది మంది భారతీయులలో ఒకరు 75 సంవత్సరాల వయస్సులోపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.   అయితే ప్రతి వంద మందిలో ఏడుగురు ఆ వయస్సుకు చేరుకునే లోపే ఈ వ్యాధితో చనిపోయే ప్రమాదం ఉంది. భారతదేశం 2022 లో 1.41 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు , 9,16,827 మరణాలను నమోదు చేయగా, 3.25 మిలియన్లకు పైగా ప్రజలు గత ఐదేళ్లలో చేసిన క్యాన్సర్ నిర్ధారణతో జీవిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్గా ఉద్భవించింది, 2022 లో 1,92,020 కొత్త కేసులు నమోదయ్యాయి, తరువాత పెదవి మరియు నోటి కుహర క్యాన్సర్ (1,43,759 కేసులు) గర్భాశయ క్యాన్సర్ (1,27,526) ఊపిరితిత్తుల క్యాన్సర్ (81,748) అన్నవాహిక క్యాన్సర్ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 175 జిల...

రేపు ముంబాయికి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్

రేపు సాయంత్రం డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ భుజాలకి చికిత్స.కొంత కాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయంతో భాదపడుతున్న పవన్ రెండు భుజాలకు చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బంది పడుతున్న డిప్యూటీ సిఎం.ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న పవన్ కళ్యాణ.వైద్య పరీక్షల తర్వాత వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించిన వైద్యులు. చికిత్స్ అనంతరం కొద్దిరోజులు పవన్ కళ్యాణకు విశ్రాంతి.

ఆన్లైన్ న్యూస్ వీడియో డిమాండ్

 ఆన్లైన్ న్యూస్ వీడియోలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో న్యూస్ వీడియోల వినియోగం ఆసియాలో గణనీయంగా ఎక్కువగా ఉంది. మీరు సమాచారం, గ్రాఫిక్స్, వీడియో బైట్స్ మరియు యాంకర్ ప్రెజెంటేషన్తో ప్యాక్ చేయబడిన చిన్న రూపంలో కథను చెబితే, ఎక్కువ వీక్షణలు లభిస్తాయి. యువ ప్రేక్షకులు స్మార్ట్ ఫోన్ల చుట్టూ కొత్త అలవాట్లను పెంచుకుంటారు.

SIR ఫారం పేరుతో జరుగుతున్న మోసం

 ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో SIR - Special Intensive Revision చేస్తోంది. 18 ఏళ్లు పైబడిన అందరి పేర్లు ఉండేలా మరియు అక్రమ ఓటర్లను తొలగించే ఉద్దేశ్యం.SIR ఫారం నింపిన తర్వాత మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తుంది.కాల్ చేసే వ్యక్తి తను BLO - బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చిన OTP చెప్పండి" అని అడుగుతాడు.ఒక్కసారి OTP చెప్పారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది.భోపాల్‌లో ఇలాంటి స్కామ్ ఇప్పటికే రిపోర్ట్ అయింది. మోసగాళ్లు ప్రభుత్వ అధికారుల్లా నటించి "SIR.apk" లింక్ పంపి డేటా దొంగిలిస్తున్నారు ముఖ్య సూచన 1. ECI/BLO ఎవరూ ఫోన్‌లో OTP అడగరు 2. ఎవరికీ OTP ఇవ్వకండి 3. OTP కోసం బెదిరిస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి