ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

గూగుల్ ఫైనాన్స్ యాప్

 టెగ్ దిగ్గజం గూగుల్  వినయోగదారుల కోసం గూగుల్ పైనాన్స్  యాప్ ను తయారు చేసింది. ఇది యూజర్లకు షేర్ మార్కెట్  పెట్టుబడులను సులభంగా  పర్యవేక్షించకొవటానికి సహాయ పడుతుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారంతో పాటు ఏఐ ఆధారిత విశ్లేషనలను ఈ యాప్ అందిస్తుంది. దీనిలో వినియోగదారులు తమ పర్సనల్ వాచ్ లిస్ట్ లో తమకు ఆశక్తి ఉన్న కంపెనీ ల వివరాలను ట్రాక్ చేసుకొవచ్చు.కీ మూమోంట్స్ అనే కీలక ఫీచర్ ఈ యాప్ ముఖ్య ఆకర్షణ. ఇది షేర్ ధరల్లో ఆకస్మాత్తుగా చోటుచేసుకొనే మార్పుల కారణాలను ఏఐ  విశ్లేషించి సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. ఇదే కాకుండా వివిద కంపెనీల  మార్రెట్ థోరణులపై లోతైన విశ్లేషన కోసం గూగుల్ ఏఐ రీసెర్చ్  ఆసిస్టెంట్  కూడా యూజర్లు వినియోగించవచ్చు.
ఇటీవలి పోస్ట్‌లు

బంధుకేర్ క్యాన్సర్ యాప్

 బంధుకేర్ క్యాన్సర్ బారిన పడిన రోగులకు ఎంతో భరోసానిస్తుంది. హైదరబాద్ ట్రిపుల్ ఐటీ లాంగ్వేజ్ టెక్నాలిజీస్  రీసెర్చ్ సెంటర్ ఆచార్యులు రూపొందించిన బంధుకేర్ ..ఇప్పుడు క్యాన్సర్ ఏం కాదులే నయమవుతుంది అనే భరోసా కల్పిస్తుంది. ఇది క్యాన్సర్ రోగులకు అవసరవైన సమాచారం అందించే  వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చేబుతుంది. ఈ యాప్ వెల్లూరు సీఎంసీ అనుపత్రి యాజమాన్యం సూచనల మేరకు రపొందించామని  సెంటర్  ప్రొఫెసర్ దీప్తి మిశ్రా  శర్మ తెలుపుతున్నారు.ఇది తెలుగుతో పాటు హిందీ,కన్నడ,ఒరియా,మరాఠీ మలయాళ బాషల్లో సమాధానం ఇచ్చేలా మలిచారని  సీఎంసీ అసుపత్రి ప్రొఫెసర్ బాలకృష్ణ వెల్లడించారు

గుండె కొవ్వు

 ఒకప్పడు కొలె స్ట్రాల్ ఎక్కువగా పెద్దవారిలో ఉంటుందని,వృద్దాప్యంలో వస్తుందని ముందు అనుకునేవారు కానీ ఇప్పడు వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ వయస్సువారికైన వచ్చే అవకాశముందని వైద్య నిపుణుల అంటున్నారు. ఇది యుక్త వయస్సు నుంచే  మొదలవుతుంది.  అధిక కొలెస్ట్రాల్ , గుండె జబ్బులు వృద్యాప్య సమస్యలనే రోజులు మరచిపొవాలి. మారుతున్న జీవన విధానం, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవటం ,నిద్రలేమి,శారీరక వ్యయమం లేకుండా,నూనె , చక్కెర, ఉప్పు కలిపి తయారు చేసిన పదార్థాలను ఎక్కువ తినడం తో కొలెస్ట్రా ల్ శాతం పెరిగి గుండె జబ్బులకు దారి తీస్తుంది. గుండె కు ముప్పు ను పెంచే చెడ్డ కొలెస్ట్రాల్ ( ఎల్ డీ ఎల్) తగ్గించుకొవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.  కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చి ఉట్టే 9-11 ఏళ్ల వయస్స నుంచే ముందస్తు కొలెస్ట్రాల్ పరీక్షలు ఆరంభించటం మంచిదని, అధిక కొలెస్ట్రాల్ తొలి దశలో గుర్తిచంటమే కాదు, వీలైనంత ముందుగా చికిత్స మొదలెట్టటం మఖ్యమని వైద్యులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ అంతా చెడ్డది కాదు. మంచి రకం -హెచ్ డీ ఎల్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో ప్రసరించే అధిక కొలెస్ట్రాల్ ను సంగ్రహించి కాలేయానికి చ...

పస్ట్ నైట్... పూజల పై క్యారీటీ

    ట్రైన్ లో మొన్న పస్ట్ క్లాస్ ఏసీ లో పస్ట్ నైట్ సెట్ వేశారని, ఈ రోజు ట్రైన్ లో ఒక బోగిలో పూజలు కానించాలరని విడియోలు వైరల్ ఆవుతున్నాయి. పస్ట్ నైట్ సెట్ కు అనుమతించిన అధికారులపై రైల్వే శాఖ చర్యలను తీసుకుంది. అదే విధంగా  ట్రైన్‌లోని ఒక బోగీలో పూజలు చేశారంటూ చక్కర్లు కొడుతున్న వీడియోపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. అది ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని తెలిపింది. సాధారణ ప్రయాణికులది బోగీ కాదని, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నదని స్పష్టం చేసింది. సెలూన్ కారును ఐఆర్‌సీటీసీ ద్వారా ఒక ప్రైవేట్ పార్టీ జులై 8న బుక్ చేసుకున్నారని పేర్కొంది.సైలూన్ కారు అంటే ఒక  ప్రత్యేకం  బోగిలో ఏసీ బెడ్ రూమ్, డైనింగ్, కిచెన్,వాష్ రూమ్ వంటి సౌకర్యాలతో హోటల్ లాంటి ఈ బోగిని డబ్జు కంటి బుక్ చేసుకుంటారు.

ఒకే దేశం.. ఒకే ఎన్నిక సాధ్యమా...

  2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' ప్లాన్‌ను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తోంది. ఈ ప్లాన్ అమలైతే దేశం మొత్తంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి.దీనికోసం కనీసం 13 రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని తగ్గించాల్సి ఉంటుంది. మరో 10 అసెంబ్లీలను రద్దు చేయడం లేదా పదవీకాలం పొడిగించడం జరుగుతుంది. ఎన్నికల చక్రాన్ని సమకాలీకరించడానికి ఇది ఒకేసారి చేసే ప్రక్రియ.ఈ అంశంపై జాయింట్ కమిటీ ఛైర్మన్ పి.పి. చౌదరి మాట్లాడారు. 2029కి ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు సంప్రదించిన 99% పౌర సమాజ వాటాదారులు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారని చెప్పారు. తరచుగా ఎన్నికలు జరగడం వల్ల 7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం జరుగుతోందని కమిటీ అంచనా.2029లో ONOE అమలైతే 2028లో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం – ఈ రాష్ట్రాల పదవీకాలం 1 సంవత్సరం కంటే తక్కువకు తగ్గుతుంది.2027లో ఎన్నికయ్యే ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ పదవీకాలాలు 2 సంవత్సరాలు తగ్గు...

బెడ్‌రోల్ చోరీ..రూ.104 కోట్ల నష్టం

 రైళ్లలోని ఏసీ కోచ్‌ల్లో ప్రయాణికులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భారీగా దుప్పట్లు, టవల్ చోరీ చేస్తున్నారు. గత నాలుగేళ్లలో సుమారు కోటి 27 లక్షల బెడ్‌రోల్‌ను అపహరించారు. దీంతో రైల్వే శాఖకు దాదాపు 104 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. మొత్తం 54 రైల్వే డివిజన్ల నుంచి ఈ సమాచారం సేకరించారు."

ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం - నాణెం పై తెలుగు భాష

 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య  సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో పట్టాభి సీతారామయ్య  ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య  ను సభ దృష్టి ముందు పెట్టారు. పట్టాభీ.. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ?  మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గాంధీ  మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఎగతాళిగా మాట్లాడారు.  వెంటనే పట్టాభి సీతారామయ్య  తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష .. ఆంగ్లంలో జాతీయ భాష  హిందీలో, దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలో ఉంది. ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే  అంటూ చురక వేశారు.తెలుగు మాతృ బాషా కాని వారు ఆశ్చర్యపోయారు.భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను ...