ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హైదరాబాద్‌ లో ఆపిల్‌



తెలంగాణా  చీఫ్ మినిస్టర్ సమక్షం లో,తిమోతి డోనాల్డ్ టిం కుక్ ఆపిల్ మొబైల్ సి . ఇ . ఓ,హైదరాబాద్ లో  డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంబించారు . ఆపిల్‌ కంపెనీ హైదరాబాద్‌ వైపు మోగ్గుచూపటం తో హైదరాబాద్‌ లో 4500 మందికి ఉఫాది లబించే ఆవకాశముంది.  హైదరాబాద్లో ప్రస్తుతం 3.7 లక్షల మంది ఐటి కంపెనీలలో పనిచేస్తున్నారు. సుమారు 66 కోట్ల టర్ణోవర్‌ జరుగుతున్నట్లు అంచనా..తెలంగాణా ప్రభుత్వం ఐటి లో పెట్టుబడులు రాబట్టటానికి పూర్వవైభవం కొనసాగించటానికి ప్రయత్నిస్తుంది.గత సంవత్సరం గూగుల్‌ సంస్థ ఏడు ఎకరాలలో స్థలంలో తన కాంపాస్‌ ఏర్పాటు చేయటానికి ఎంఒయు కుదుర్చకున్న విషయం తెలిసిందే...
ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి ప్రజల ఆతిథ్యం తనకెంతో నచ్చాయని, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆపిల్ సంస్థకు అందిస్తున్న సహాయ సహకారాలు, సహకరించిన విధానం తనకు చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారం ఈ దేశ సంస్కృతిని ప్రతిభింభిస్తుందని అన్నారు. ఆతిథులకు సహకారం అందించడంలో భారతదేశం తమ దేశం కన్నా ముందు నిలుస్తుందని కొనియాడారు. ప్రపంచ ఐటి రంగ దిగ్గజాలయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ఆమెజాన్ వంటి సంస్థలు తమ కార్యలయాలను హైదరాబాద్ లో స్థాపించుకున్నాయని, వాటికి ఆపిల్ సంస్థ తోడవడం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని అన్నారు. ప్రపంచ దిగ్గజం ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ రాక ద్వారా నూతన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి దిశ నిరూపితమయిందని సిఎం అన్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం