ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఘనంగా తెలంగాణా రాష్ట్రావతరణ వేడుకలు

వచ్చే నెల 2 హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ కేబినెట్ సబ్ కమిటి చైర్మన్ నాయిని నర్సింహరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో క్యాంపు కార్యాలయంలో మంగళవారం విషయమై సమీక్ష నిర్వహించారు

హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
--
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడాలి.
--
హైదరాబాద్ లో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనే సభ నిర్వహించాలి
--
జిల్లా కేంద్రంలో జిల్లాకు చెందిన మంత్రి, కలెక్టర్, ఇతర ప్రముఖులందరూ కార్యక్రమంలో పాల్గొనాలి
--
అమర వీరుల కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రాల్లో ఘనంగా సన్మానించాలి. కార్యక్రమంలో వారికి విఐపి హోదా కల్పించాలి. 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా ఆహ్వానించి, గౌరవించాలి
--
జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మందికి రాష్ట్ర స్థాయిలో, 25 మంది చొప్పున జిల్లా కేంద్రాల్లో అవార్డులు అందించాలి
--
హైదరాబాద్ తో పాటు, ఇతర నగరాలు, జిల్లా కేంద్రాల్లో వీధులను, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను అలంకరించాలి. పరిశ్రమలు, హాస్పిటళ్లు, హోటళ్లు, మాల్స్, థియేటర్స్ లలో కూడా పండుగ వాతావరణం ఉండాలి. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని తెలుపుతూ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలి
--
ఎయిర్ పోర్టు, హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లను కూడా అలంకరించి, బ్యానర్లు ఏర్పాటు చేయాలి
--
హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి. అనాథ శరణాలయాలు, అంధుల పాఠశాలల్లో పండ్లు, స్వీట్లు పంచాలి. మాంసాహారం అందించాలి
--
రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి
--
దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి.
--
జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావం ఇతివృత్తంగా తెలుగు, ఉర్ధూ భాషల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలి
--
రాష్ట్రంలోని అన్ని అమరవీరుల స్థూపాలను, తెలంగాణ తల్లి విగ్రహాలను అలంకరించాలి
--
విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి
--
ట్యాంకు బండుపై జూన్ 2 రాత్రి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబురాలు చేయాలి
--
నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేయాలి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు