ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఘనంగా తెలంగాణా రాష్ట్రావతరణ వేడుకలు

వచ్చే నెల 2 హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ కేబినెట్ సబ్ కమిటి చైర్మన్ నాయిని నర్సింహరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో క్యాంపు కార్యాలయంలో మంగళవారం విషయమై సమీక్ష నిర్వహించారు

హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
--
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడాలి.
--
హైదరాబాద్ లో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనే సభ నిర్వహించాలి
--
జిల్లా కేంద్రంలో జిల్లాకు చెందిన మంత్రి, కలెక్టర్, ఇతర ప్రముఖులందరూ కార్యక్రమంలో పాల్గొనాలి
--
అమర వీరుల కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రాల్లో ఘనంగా సన్మానించాలి. కార్యక్రమంలో వారికి విఐపి హోదా కల్పించాలి. 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా ఆహ్వానించి, గౌరవించాలి
--
జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మందికి రాష్ట్ర స్థాయిలో, 25 మంది చొప్పున జిల్లా కేంద్రాల్లో అవార్డులు అందించాలి
--
హైదరాబాద్ తో పాటు, ఇతర నగరాలు, జిల్లా కేంద్రాల్లో వీధులను, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను అలంకరించాలి. పరిశ్రమలు, హాస్పిటళ్లు, హోటళ్లు, మాల్స్, థియేటర్స్ లలో కూడా పండుగ వాతావరణం ఉండాలి. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని తెలుపుతూ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలి
--
ఎయిర్ పోర్టు, హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లను కూడా అలంకరించి, బ్యానర్లు ఏర్పాటు చేయాలి
--
హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి. అనాథ శరణాలయాలు, అంధుల పాఠశాలల్లో పండ్లు, స్వీట్లు పంచాలి. మాంసాహారం అందించాలి
--
రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి
--
దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి.
--
జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావం ఇతివృత్తంగా తెలుగు, ఉర్ధూ భాషల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలి
--
రాష్ట్రంలోని అన్ని అమరవీరుల స్థూపాలను, తెలంగాణ తల్లి విగ్రహాలను అలంకరించాలి
--
విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి
--
ట్యాంకు బండుపై జూన్ 2 రాత్రి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబురాలు చేయాలి
--
నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేయాలి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..