ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రూ. 5ల‌క్ష‌ల బంప‌ర్ బ‌హుమ‌తి ....


2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్నును ఈ నెల 31వ తేదీలోగా చెల్లించేవారికి న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ప‌న్నును మే 31వ తేదీలోపు చెల్లించే ప‌న్నుదారుల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన 119 న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ ఆస్తిప‌న్నును ఆన్‌లైన్ విధానంతో పాటు జీహెచ్ఎంసి సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, ఈ-సేవా కేంద్రాలు, ఎంపిక చేసిన బ్యాంకుల బ్రాంచీల‌లో చెల్లించ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. మే 1వ తేదీ నుండి ఈ నెల 31 తేదీ వ‌ర‌కు ప‌న్ను చెల్లించిన‌వారంద‌రినీ ఈ బ‌హుమ‌తులు అంద‌జేయ‌డానికి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. బంప‌ర్‌ బ‌హుమ‌తి 1,00,000న‌గ‌దు, మొద‌టి బ‌హుమ‌తి 50,000 రూపాయ‌లు ఒకొక్క‌రి చొప్పున, రెండ‌వ బహుమ‌తి రూ. 25,000 న‌గ‌దు ఇద్ద‌రికి, మూడ‌వ బ‌హుమ‌తి 10,000 రూపాయ‌ల చొప్పున ఐదుగురికి, నాలుగ‌వ బ‌హుమ‌తి 5,000రూపాయ‌ల చొప్పున ప‌ది మందికి, క‌న్సోలేష‌న్ బ‌హుమ‌తిగా 100మందికి 2,000 రూపాయ‌ల చొప్పున అంద‌జేయ‌నున్న‌ట్టు  క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి వివ‌రించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 14,38,835 మంది ఆస్తిప‌న్ను చెల్లింపుదారులు ఉండ‌గా కేవ‌లం 2,83,148మంది మాత్ర‌మే ప్ర‌స్తుత సంవ‌త్స‌రం ఆస్తిపన్నును  చెల్లించార‌ని పేర్కొన్నారు. ఇంకా 11,55,687మంది ఆస్తిప‌న్నును చెల్లించాల్సి ఉంద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. ఆస్తిప‌న్నును వెంట‌నే చెల్లించ‌డం ద్వారా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రింత స్వ‌చ్ఛ న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తిఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని క‌మిష‌న‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో విజ్ఞ‌ప్తి చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..