ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంబేద్కర్ విగ్రహ స్థాపన

అత్యంత ఎత్తులో నిర్మించతలపెట్టిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపనకుతెలంగాణా  ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం చైనా ప్రభుత్వ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు తెలంగాణా  ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో చర్చలు జరిపారు. గతంలో తాము చైనాలో చేపట్టిన ప్రతిష్టాత్మక కట్టడాలను సిఎంకు వివరించారు. 125 అడుగుల భారీ విగ్రహ ప్రతిష్టాపనకు కావలసిన డిజైన్, ఆర్కిటెక్చర్, నిర్మాణ సమయం తదితర అన్ని సాంకేతిక అంశాలపై సిఎం వారితో చర్చించారు.
ఖర్చుకు వెనకాడకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న విగ్రహ ప్రతిష్టాపన కోసం త్వరలో కమిటీ సభ్యులు చైనాను సందర్శించి అక్కడి నిర్మాణాల తీరును పరిశీలించి ఒప్పందం కుదర్చుకోనున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు