ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రంజాన్ ఘనంగా నిర్వహించాలి కేసీ ఆర్

తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించాలని, ప్రభుత్వ పరంగా ఈద్గా, మసీదుల దగ్గర కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీనియర్ ఐపిఎస్ అధికారి ఎ.కె. ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 26న హైదరాబాద్ లోని నిజాం కాలేజి మైదానంలో సాయంత్రం ప్రత్యేక ప్రార్థన చేసి, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మత పెద్దలు, రాయబారులు, కాన్సులేట్లను ఆహ్వానించాలని సిఎం చెప్పారు. నిజాం కాలేజిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో తాను పాల్గొంటానని సిఎం వెల్లడించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు జరగాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి కలెక్టర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలని సూచించారు.
రంజాన్ సందర్భంగా 2 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్ నగరంలోని 100 ప్రాంతాల్లో, జిల్లాల్లో 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. మదర్సాలు, అనాథ శరణాలయాల్లో కూడా దుస్తులు పంపిణీ చేయాలన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రార్థనా స్థలాల వద్ద కావాల్సిన కనీస వసతులు ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు.
పేద ముస్లింలు, మైనారిటీల విద్య, ఉపాధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది మైనారిటీలకు ప్రభుత్వ పరంగా భూ పంపిణీ జరిగినట్లు లెక్కలున్నాయని, అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో విచారణ జరపమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. వివరాలు అందిన వెంటనే సదరు భూములన్నీ మైనారిటీలకు వందశాతం ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్ భూముల అభివృద్ధి కార్యక్రమం తీసుకుని, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులకు ఉపయోగపడేలా చేయాలన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..