ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రంజాన్ ఘనంగా నిర్వహించాలి కేసీ ఆర్

తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించాలని, ప్రభుత్వ పరంగా ఈద్గా, మసీదుల దగ్గర కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీనియర్ ఐపిఎస్ అధికారి ఎ.కె. ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 26న హైదరాబాద్ లోని నిజాం కాలేజి మైదానంలో సాయంత్రం ప్రత్యేక ప్రార్థన చేసి, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మత పెద్దలు, రాయబారులు, కాన్సులేట్లను ఆహ్వానించాలని సిఎం చెప్పారు. నిజాం కాలేజిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో తాను పాల్గొంటానని సిఎం వెల్లడించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు జరగాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి కలెక్టర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలని సూచించారు.
రంజాన్ సందర్భంగా 2 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్ నగరంలోని 100 ప్రాంతాల్లో, జిల్లాల్లో 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. మదర్సాలు, అనాథ శరణాలయాల్లో కూడా దుస్తులు పంపిణీ చేయాలన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రార్థనా స్థలాల వద్ద కావాల్సిన కనీస వసతులు ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు.
పేద ముస్లింలు, మైనారిటీల విద్య, ఉపాధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది మైనారిటీలకు ప్రభుత్వ పరంగా భూ పంపిణీ జరిగినట్లు లెక్కలున్నాయని, అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో విచారణ జరపమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. వివరాలు అందిన వెంటనే సదరు భూములన్నీ మైనారిటీలకు వందశాతం ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్ భూముల అభివృద్ధి కార్యక్రమం తీసుకుని, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులకు ఉపయోగపడేలా చేయాలన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.