ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణా కేబినేట్ కీలక నిర్ణయాలు


 తెలంగాణా కేబినేట్   సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు . అవి

1. వరంగల్ లో అగ్రికల్చర్ కాలేజి ఏర్పాటు చేయాలని నిర్ణయం.
2. వరంగల్ జిల్లా మామునూర్ లో వెటర్నిటీ కాలేజి ఏర్పాటు చేయాలని నిర్ణయం.
3. తెలంగాణ రాష్ట్రంలో ఫిషరీస్ సైన్స్ కాలేజి ఏర్పాటు చేయాలని నిర్ణయం. మిషన్ కాకతీయ వల్ల చెరువులు బాగుపడ్డాయి కాబట్టి వాటిలో మత్స్యసంపదను పెంచాలని నిర్ణయం.
4. మెదక్ లో NIMZ, హైదరాబాద్ ఫార్మా NIMZ కోసం టిఎస్ఐఐసి రూ. 784 కోట్లు హడ్కో రుణం పొందడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం.
5. దేవాదాయ, ధర్మాదాయ ధార్మిక సంస్థల్లో ట్రస్ట్ మెంబర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం. కోటి ఆదాయం దాటిన సంస్థల్లో సభ్యుల సంఖ్యను 9 నుంచి 14, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు ఆదాయం ఉన్న సంస్థల్లో కూడా 9 నుంచి 14, రెండు నుంచి 25 లక్షల ఆదాయం కలిగిన సంస్థల్లో 5 నుంచి 7, రెండు లక్షల ఆదాయం లోపు వున్న వాటిలో మూడు నుంచి ఐదుకు ట్రస్టు మెంబర్లను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.
6. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించడానికి అవసరమైన విధానం రూపకల్పన కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన శ్రీనివాసయాదవ్, నాయిని నర్సింహరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావులతో కేబినెట్ సబ్ కమిటీ. దేవాలయాల్లో వచ్చే ఆదాయం – దేవాలయ మాన్యాలు – అక్రమాల నియంత్రణ – హుండీ ఆదాయం దుర్వినియోగం తదితర అంశాలపై అధ్యయనం జరిపి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలకు పూర్వ వైభవం తేవడానికి కృషి.
7. మైక్రో ఇరిగేషన్ ను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ 1000 కోట్ల రూపాయల నాబార్డు రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం.
8. తెలంగాణలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడానికి, శాస్త్రీయమైన శీతల గిడ్డంగుల నిర్మాణం కోసం అవసరమైన వ్యూహాన్ని వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలు ఖరారు చేయాలని నిర్ణయం. కల్తీల నిరోధానికి చర్యలు తీసుకోవడానికి సిఫారసులు చేయాలి.
9. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కేబినెట్ ఆమోదించింది.
10. అసైన్డ్ భూముల నిగ్గు తేల్చేందుకు, కమతాల ఏకీకరణకు, భూముల క్రమబద్ధీకరణకు, ప్రభుత్వ శాఖల వద్ద నిరుపయోగంగా వున్న భూముల వినియోగం కోసం అవసరమైన విధానం రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశిస్తూ నిర్ణయం.
11. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యత, ఎక్కువ నీటిని వినియోగించుకోవడమే లక్ష్యంగా ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, రీడిజైన్ చేయాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ప్రాణహిత – చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఆవశ్యకతను కేబినెట్ అంగీకరించింది.
12. తెలంగాణలో ఎంత మంది ఇంజనీర్లు, ఎంతో మంది టీచర్లు అవసరం? ఎంత మంది విద్యార్థులు ప్రతీ ఏటా ఇంజనీర్లు, టీచర్లు అవుతున్నారు? ఉద్యోగ అవకాశం లేకున్నా ఇంజనీరింగ్, బిఇడి కాలేజీల వల్ల వచ్చే అర్హులు నిరుద్యోగులు అవుతున్నారు. ఇలా జరగకుండా ఏమి చేయాలనే విషయంలో అవసరమైన విధానం రూపొందించాలని విద్యాశాఖను ఆదేశిస్తూ నిర్ణయం.
13. గోదావరి, కృష్ణా నదుల్లో వాటా ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నా ఏపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అబద్ధాలతో, అర్ధరహిత వాదనలతో కేంద్రానికి లేఖలు రాస్తున్నది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించాలి. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని, కృష్ణా బోర్డు అధికారులను కలిసి వాస్తవాలు చేప్పి రావాలి. అవసరమైతే ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో బృందం ప్రధానిని కలిసి రావాలి.
14. వచ్చేనెలలో జరిగే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగమంతా భాగస్వామ్యం కావాలి.
15. సాదా బైనామాలు, మ్యుటెషన్స్, పౌతీల విషయంలో ప్రభుత్వం ఇటీవల తెచ్చిన భూ పరిపాలనా సంస్కరణలు కట్టుదిట్టంగా అమలు చేయాలి.
16. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం సైట్ వైజ్ టెండర్లు పిలవాలి. స్థానికులకే నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..