ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎ.పి. భవన్ తెలంగాణకు అప్పగించాలి : కె. చంద్రశేఖర్ రావు

న్యూఢిల్లీలో ఎ.పి. భవన్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ స్థలం హైదరాబాద్ రాష్ట్రానికి చెందింది కాబట్టి దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు గురువారం లేఖ రాశారు. దేశ రాజధానిలో త్వరలోనే ఓ పద్ధతిగా, ప్రణాళికా బద్ధంగా తెలంగాణ భవన్ నిర్మించాలనుకుంటున్నామని, కాబట్టి సదరు స్థలాన్ని తమకు అప్పగించే విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని సిఎం ఈ లేఖలో కోరారు.
‘‘హైదరాబాద్ కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936 లో మూడు బిట్లుగా ఢిల్లీలో ఉన్న 18.18 ఎకరాల స్థలాన్ని విదేశీ, రాజకీయ వ్యవహారాల శాఖ నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఎపి భవన్ ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ హౌజ్ ను కేంద్రం తీసుకుంది. పటౌడి హౌజ్లోని 7.56 ఎకరాలను, నర్సింగ్ ఇన్ స్టిట్యూట్ లోని 1.21 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించారు. ఆరవ నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్ కే బదిలీ అయింది. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం లేదు. ఆంధ్ర ప్రాంతమంతా 1953 వరకు మద్రాస్ రాష్ట్రంలోనే ఉంది. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు సదరు స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాదు. 1956లో కలిసిన రెండు రాష్ట్రాలు 2014లో విడిపోయి ఎవరి రాష్ట్రాలుగా అవి చలామణి అవుతున్నాయి. ప్రస్తుతమున్న తెలంగాణ గతంలోని హైదరాబాద్ రాష్ట్రంలోని భాగమే. అలాగే ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 1953 నుంచి 1956 వరకు ఇప్పుడున్న భూభాగంతోనే ఉండేది. కాబట్టి ఆ స్థలం తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుంది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. ఈ స్థలాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజించడానికి వీల్లేదు. 1956 వరకు రెండు వేర్వేరు రాష్ట్రాలుగా చలామణి అయిన రెండు రాష్ట్రాలకు ఢిల్లీలో రెండు వేర్వేరు భవన్లు ఉండాల్సి ఉండేది. నిజాం రాజుల నుంచి వచ్చిన స్థలాన్ని హైదరాబాద్ కు కేటాయించినట్లే, మద్రాస్ నుంచి వేరు పడిన ఆంధ్రకు ప్రత్యేకంగా ఢిల్లీలో స్థలం కేటాయించాల్సి ఉండేది. అలా కాకుంటే తమ జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాస్ (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రానికున్న స్థలంలో ఆంధ్రకు వాటా ఇవ్వాల్సి ఉండేది. ఈ చారిత్రక ఆధారాలు, వాస్తవాలు గమనించి సదరు స్థలాన్ని తెలంగాణకు అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము త్వరలోనే అక్కడ పద్దతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా తెలంగాణ భవన్ నిర్మించాలనుకుంటున్నామని, కాబట్టి సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..