ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వ చర్యలు


1. గత ప్రభుత్వాలు ఆర్టీసీని అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఆర్టీసీ నష్టాలు అంతకంతకూ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆర్టీసీకి రూ.2,275 కోట్ల అప్పు ఉంది. ప్రతీ నెలా నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసిని నడపడానికి చివరికి ఉద్యోగుల కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.180 కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి నుంచి కాపాడడం కోసం ఆర్టీసికి బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతీ నెల రూ.75 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయాన్ని ఆర్టీసికి అందిస్తున్నారు.
2. అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్ ఆర్టీసికి గుదిబండలా మారింది. ఎక్కువ నష్టాలు దీనివల్ల వస్తున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కించడానికి హైదరాబాద్ నగరంలో తిరిగే బస్సుల ద్వారా వచ్చే నష్టాన్ని క్రాస్ సబ్సిడి ద్వారా జిహెచ్ఎంసి భరించే విధాన నిర్ణయం తీసుకున్నారు.
3. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. 1100 బస్సులు పూర్తిగా పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి కొనడంతో పాటు మరో 100 బస్సులు కొత్తవి కొనాల్సి వుంది. మొత్తంగా 1200 బస్సులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.300 కోట్ల వరకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది.
4. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారి వేతనాలు పెంచింది. డీజిల్ రేట్లు కూడా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి.
5. విద్యార్థుల బస్సు పాసులతో పాటు, వివిద రాయితీల కింద ఇచ్చే బస్ పాస్ లపై అయ్యే వ్యయం దాదాపు రూ.500 కోట్లు ఉంటుంది. ఈ డబ్బును కూడా ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు చెల్లించాలని నిర్ణయించింది.
పల్లె వెలుగులో ఒక్క రూపాయే పెంచండి 
పల్లె వెలుగులో ఒక్క రూపాయే పెంచండి
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరమని, చార్జీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సామాన్యులు, పల్లె ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల లోపు ఒక్క రూపాయి, 30 కిలో మీటర్ల పైన (ఎంత దూరమైనా) రెండు రూపాయలు మాత్రమే ధర పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. సగం మంది ఆర్టీసీ ప్రయాణికులు పల్లె వెలుగు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు కాబట్టి, పేదలకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని, అందుకే పల్లె వెలుగు చార్జీలను పెద్దగా పెంచవద్దని సిఎం చెప్పారు. మిగతా బస్సుల్లో కూడా పదిశాతం మించకుండా చార్జీలు పెంచాలని సిఎం సూచించారు.
సింగరేణిపై దృష్టి పెట్టండి

తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థయిన సింగరేణిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే సింగరేణిపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, అన్ని అంశాలను చర్చించనున్నట్లు వెల్లడించారు.
చార్జీల పెంపుపై  తుది నిర్ణయం

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయం గురువారం వెలువడే అవకాశం ఉంది. ఈ రెండు శాఖల అధికారులు తమ ప్రతిపాదనలు సిఎంకు వివరించగా, సిఎం కూడా పలు సూచనలు చేశారు. సామాన్యులపై భారం పడని విధంగా పెంపు ఉండాలనే సిఎం సూచనల మేరకు అధికారులు తుది నివేదిక తయారు చేయనున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఇతర ప్రాంతాల్లో పర్యటనల్లో ఉండడంతో గురువారం పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు