ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వ చర్యలు


1. గత ప్రభుత్వాలు ఆర్టీసీని అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఆర్టీసీ నష్టాలు అంతకంతకూ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆర్టీసీకి రూ.2,275 కోట్ల అప్పు ఉంది. ప్రతీ నెలా నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసిని నడపడానికి చివరికి ఉద్యోగుల కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.180 కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి నుంచి కాపాడడం కోసం ఆర్టీసికి బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతీ నెల రూ.75 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయాన్ని ఆర్టీసికి అందిస్తున్నారు.
2. అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్ ఆర్టీసికి గుదిబండలా మారింది. ఎక్కువ నష్టాలు దీనివల్ల వస్తున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కించడానికి హైదరాబాద్ నగరంలో తిరిగే బస్సుల ద్వారా వచ్చే నష్టాన్ని క్రాస్ సబ్సిడి ద్వారా జిహెచ్ఎంసి భరించే విధాన నిర్ణయం తీసుకున్నారు.
3. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. 1100 బస్సులు పూర్తిగా పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి కొనడంతో పాటు మరో 100 బస్సులు కొత్తవి కొనాల్సి వుంది. మొత్తంగా 1200 బస్సులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.300 కోట్ల వరకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది.
4. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారి వేతనాలు పెంచింది. డీజిల్ రేట్లు కూడా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి.
5. విద్యార్థుల బస్సు పాసులతో పాటు, వివిద రాయితీల కింద ఇచ్చే బస్ పాస్ లపై అయ్యే వ్యయం దాదాపు రూ.500 కోట్లు ఉంటుంది. ఈ డబ్బును కూడా ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు చెల్లించాలని నిర్ణయించింది.
పల్లె వెలుగులో ఒక్క రూపాయే పెంచండి 
పల్లె వెలుగులో ఒక్క రూపాయే పెంచండి
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరమని, చార్జీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సామాన్యులు, పల్లె ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల లోపు ఒక్క రూపాయి, 30 కిలో మీటర్ల పైన (ఎంత దూరమైనా) రెండు రూపాయలు మాత్రమే ధర పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. సగం మంది ఆర్టీసీ ప్రయాణికులు పల్లె వెలుగు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు కాబట్టి, పేదలకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని, అందుకే పల్లె వెలుగు చార్జీలను పెద్దగా పెంచవద్దని సిఎం చెప్పారు. మిగతా బస్సుల్లో కూడా పదిశాతం మించకుండా చార్జీలు పెంచాలని సిఎం సూచించారు.
సింగరేణిపై దృష్టి పెట్టండి

తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థయిన సింగరేణిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే సింగరేణిపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, అన్ని అంశాలను చర్చించనున్నట్లు వెల్లడించారు.
చార్జీల పెంపుపై  తుది నిర్ణయం

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయం గురువారం వెలువడే అవకాశం ఉంది. ఈ రెండు శాఖల అధికారులు తమ ప్రతిపాదనలు సిఎంకు వివరించగా, సిఎం కూడా పలు సూచనలు చేశారు. సామాన్యులపై భారం పడని విధంగా పెంపు ఉండాలనే సిఎం సూచనల మేరకు అధికారులు తుది నివేదిక తయారు చేయనున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఇతర ప్రాంతాల్లో పర్యటనల్లో ఉండడంతో గురువారం పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..