ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చంద్ర బాబు రెండేళ్ళ పాలన ..

ఏడు మిషన్లతో ఆరంభమైన మన ప్రగతి ప్రస్థానం ఏడాది తిరిగే సరికే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా నిరుత్సాహకర పరిస్థితి వుండగా, దానికి భిన్నంగా జాతీయస్థాయిలో కనిపించిన ఆశావాహ
దృక్పధాన్ని ఆలంబనగా తీసుకుని, కొత్త రాష్ట్రంలో పరవళ్లు తొక్కే ఉత్సాహాన్నే ఊతంగా మార్చుకుని తొలి ఏడాదిలోనే అద్భుతమైన ఆర్థిక ఫలితాల్ని సొంతం చేసుకున్నాం. 10.9శాతం వృద్ధి రేటును సాధించాం. పదేళ్ల పాలనకు సంబంధించిన సమస్యలు, రాష్ట్ర విభజన తెచ్చిన సంక్లిష్టతలు, ఇలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వున్నా రెండంకెల వృద్ధి రేటు సాధించడం ఈ ప్రభుత్వం సాధించిన తొలి విజయం.
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా 7వ స్థానంలో, జనాభాపరంగా 10వ స్థానంలో ఉంది. అయినా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 10.9 శాతం వృద్ధిరేటు నమోదుచేసుకుంది. అంతకుముందు ఏడాది కంటే 2.1 శాతం వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలలో కలిపి 8.40 శాతం, పరిశ్రమల రంగంలో 11.13 శాతం, సేవల రంగంలో 11.39 శాతం వృద్ధి కనిపించింది.
తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష రూపాయిలకు పైగా నమోదు కావడం మరో రికార్డు. 7జిల్లాలలో తలసరి ఆదాయం లక్ష రూపాయిలుగా ఉంది. అంతకుముందు ఏడాది తలసరి ఆదాయం రూ.97,855 కాగా, 2015లో 1.07 లక్షలకు చేరుకుంది. జీఎస్‌డీపీలో మన రాష్ట్రం 8వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చింది. తలసరి ఆదాయంలో 9వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుంది.
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన రెండేళ్ల వ్యవధిలోనే రెండంకెల సుస్థిర వృద్ధి రేటు సాధించడం నిజంగా అపూర్వం, అనితర సాధ్యం. అభివృద్ధి దార్శనికత, ఆర్థికాభివృద్ధికి అనుసరిస్తున్న సమగ్ర ప్రణాళిక, సమర్ధ కార్యాచరణ వల్లనే ఈ వృద్ధి మనకు సాధ్యమైంది. ఇదే ఉత్సాహంతో 2016-17 సంవత్సరానికి 15 శాతం వృద్ధి రేటు సాధించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
2016-17 ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యాలను కూడా ప్రభుత్వం నిర్దేశించుకుంది. రూ. 6,66,634 కోట్లు జీవీఏ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రాథమికరంగంలో రూ.2,02,365 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.1,52,706 కోట్లు, సేవల రంగంలో 3,11,563 కోట్లు ఆర్జించాలని నిర్ణయించింది.
ఈ ఏడాది వృద్ధి లక్ష్యం 19.54 శాతం
2016-17లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 19.54 శాతంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16లో దేశ సగటు వృద్ధి 7.6 శాతంగా ఉండగా, రాష్ట్ర వృద్ధి 10.99 శాతంగా ఉంది. దాంతో రాష్ట్ర వృద్ధి గణనీయంగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర స్థూల అదనపు విలువ రూ.6,66,634 కోట్లుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకు తిరోగమనంలో ఉన్న వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళిక రూపొందించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.