ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం- కొత్త రికార్డు

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం లక్ష కుటుంబాల్లో వెలుగు నింపి కొత్త రికార్డు  సృష్టించిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. 2014 సెప్టెంబర్ 24 రాష్ర్ట్రంలో కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం ప్రారంభమై తర్వాత  ఇప్పటి దాకా 44,351 మంది ఎస్సీ అమ్మాయిలకు, 25,793 మంది ఎస్టీ అమ్మాయిలకు, 33,913 మంది మైనారిటీ అమ్మాయిలకు... మొత్తం 1,04,057 మందికి పథకం ద్వారా రూ.51వేల ఆర్థిక సహాయం అందింది. ఇందుకోసం ఇప్పటి దాకా రూ.530 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పేదింటి ఆడపిల్ల పెండ్లి భారం ప్రభుత్వం పంచుకోవడంతో చాలా కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్న సమాచారం ప్రభుత్వానికి అందింది. ఆర్థిక సంవత్సరం నుంచి బిసిలు, ఇతర ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు కూడా పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. పథకం కోసం 2016-17 బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.150 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.200 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.88కోట్లు, బిసి సంక్షేమ శాఖకు రూ.300 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రూ.738కోట్లు ఖర్చు చేశారు. పథకం పేదింటి ఆడపిల్ల పెండ్లి కష్టాలను తీర్చడమే కాకుండా, బాల్య వివాహాలను నియంత్రించే సామాజిక మార్పును కూడా పథకం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నేపథ్యంలో పేదింటి ఆడపిల్లలందరికీ పథకం వర్తింపచేయాలని, బడ్జెట్లో కేటాయించిన నిధులే కాకుండా అవసరమైతే ఎక్కువ నిధులు కేటాయించడానికి కూడా ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. పథకంలోని మహోన్నత, మానవత్వ కోణాన్ని అర్థం చేసుకుని అధికారులు పకడ్బందీగా పథకాన్ని అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని సిఎం ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు