ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం- కొత్త రికార్డు

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం లక్ష కుటుంబాల్లో వెలుగు నింపి కొత్త రికార్డు  సృష్టించిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. 2014 సెప్టెంబర్ 24 రాష్ర్ట్రంలో కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం ప్రారంభమై తర్వాత  ఇప్పటి దాకా 44,351 మంది ఎస్సీ అమ్మాయిలకు, 25,793 మంది ఎస్టీ అమ్మాయిలకు, 33,913 మంది మైనారిటీ అమ్మాయిలకు... మొత్తం 1,04,057 మందికి పథకం ద్వారా రూ.51వేల ఆర్థిక సహాయం అందింది. ఇందుకోసం ఇప్పటి దాకా రూ.530 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పేదింటి ఆడపిల్ల పెండ్లి భారం ప్రభుత్వం పంచుకోవడంతో చాలా కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్న సమాచారం ప్రభుత్వానికి అందింది. ఆర్థిక సంవత్సరం నుంచి బిసిలు, ఇతర ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు కూడా పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. పథకం కోసం 2016-17 బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.150 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.200 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.88కోట్లు, బిసి సంక్షేమ శాఖకు రూ.300 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రూ.738కోట్లు ఖర్చు చేశారు. పథకం పేదింటి ఆడపిల్ల పెండ్లి కష్టాలను తీర్చడమే కాకుండా, బాల్య వివాహాలను నియంత్రించే సామాజిక మార్పును కూడా పథకం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నేపథ్యంలో పేదింటి ఆడపిల్లలందరికీ పథకం వర్తింపచేయాలని, బడ్జెట్లో కేటాయించిన నిధులే కాకుండా అవసరమైతే ఎక్కువ నిధులు కేటాయించడానికి కూడా ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. పథకంలోని మహోన్నత, మానవత్వ కోణాన్ని అర్థం చేసుకుని అధికారులు పకడ్బందీగా పథకాన్ని అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని సిఎం ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..