ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సన్ రైజర్స్ ఐపిఎల్ -9 టైటిల్ తో ...



సన్ రైజర్స్ యజమాని, సన్ గ్రూపు సిఎండి కళానిధి మారన్, సిఇవో షణ్ముగం, జెమిని టివి ఎండి కిరణ్, జిఎం బాలక్రిష్ణన్, చీఫ్ రిప్రజెంటేటివ్ ఐవి. నగేశ్ తదితరులు గురువారం క్యాంపు కార్యాలయలో ముఖ్యమంత్రిని  కలిసారు . సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ -9 చాంపియన్ షిప్ గెలుచుకోవడం తెలంగాణకు, హైదరాబాద్ కు గర్వకారణమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. క్రికెటర్లను, జట్టు యజమాని అయిన సన్ గ్రూపును ముఖ్యమంత్రి అభినందించారు.
మొదటి నుంచి సన్ రైజర్స్ జట్టును ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించి విజయవంతం చేసిందని కళానిధి మారన్ ధన్యవాదాలు తెలిపారు. సన్ రైజర్స్ విజయం సాధించడానికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ నాయకత్వం ప్రధాన కారణమని, బౌలింగ్ విభాగం ప్రతిభతో విజయాలు సాధించామని వివరించారు. హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవడం వల్ల వచ్చే సీజన్ ప్రారంభం ఇక్కడే జరుగుతుందని, ఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్ లోనే ఆడతారని కళానిధి చెప్పారు. ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేసీఆర్ ను వారు ఆహ్వానించారు. కేసీఆర్ వారి ఆహ్వానాన్ని మన్నించారు. ఐపిఎల్ 10 ప్రారంభ కార్యక్రమాన్ని, ముగింపును కూడా ఘనంగా నిర్వహిద్దామని సిఎం చెప్పారు.
ఐపిఎల్ మ్యాచ్ లు, టి 20, ఇతర మ్యాచ్ లు, వేదికలు తదితర విషయాలు కూడా చర్చించారు. కళానిధి మారన్ సోదరుడు, మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ తో ఉన్న అనుబంధాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సన్ రైజర్స్ ఇదే విధంగా ముందుకు పోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.తో 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.