ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సన్ రైజర్స్ ఐపిఎల్ -9 టైటిల్ తో ...



సన్ రైజర్స్ యజమాని, సన్ గ్రూపు సిఎండి కళానిధి మారన్, సిఇవో షణ్ముగం, జెమిని టివి ఎండి కిరణ్, జిఎం బాలక్రిష్ణన్, చీఫ్ రిప్రజెంటేటివ్ ఐవి. నగేశ్ తదితరులు గురువారం క్యాంపు కార్యాలయలో ముఖ్యమంత్రిని  కలిసారు . సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ -9 చాంపియన్ షిప్ గెలుచుకోవడం తెలంగాణకు, హైదరాబాద్ కు గర్వకారణమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. క్రికెటర్లను, జట్టు యజమాని అయిన సన్ గ్రూపును ముఖ్యమంత్రి అభినందించారు.
మొదటి నుంచి సన్ రైజర్స్ జట్టును ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించి విజయవంతం చేసిందని కళానిధి మారన్ ధన్యవాదాలు తెలిపారు. సన్ రైజర్స్ విజయం సాధించడానికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ నాయకత్వం ప్రధాన కారణమని, బౌలింగ్ విభాగం ప్రతిభతో విజయాలు సాధించామని వివరించారు. హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవడం వల్ల వచ్చే సీజన్ ప్రారంభం ఇక్కడే జరుగుతుందని, ఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్ లోనే ఆడతారని కళానిధి చెప్పారు. ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేసీఆర్ ను వారు ఆహ్వానించారు. కేసీఆర్ వారి ఆహ్వానాన్ని మన్నించారు. ఐపిఎల్ 10 ప్రారంభ కార్యక్రమాన్ని, ముగింపును కూడా ఘనంగా నిర్వహిద్దామని సిఎం చెప్పారు.
ఐపిఎల్ మ్యాచ్ లు, టి 20, ఇతర మ్యాచ్ లు, వేదికలు తదితర విషయాలు కూడా చర్చించారు. కళానిధి మారన్ సోదరుడు, మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ తో ఉన్న అనుబంధాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సన్ రైజర్స్ ఇదే విధంగా ముందుకు పోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.తో 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..