ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం





 ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ఉండదు. ప్రకృతి విక్రుత రూపం దాల్చకముందే ప్రకృతిని కాపాడుకొవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించేలా ఈ దినం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చెట్లు పూర్తిగా క్షీణించిన ఆవరణ వ్యవస్థను సైతం పునరుజ్జీవం పొస్తాయి  భూగర్భ నీటి మట్టాన్ని పెంచటానికి దొహదపడుతాయి. వరదలు, భారీ వర్షాల సమయంలో నేల కోతను, కురిసే వర్షం ఎక్కడికక్కడ భూమిలో ఇంకకుండా ప్రవహిస్తూ పొతే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి విలువైన పోషకాలు పైమట్టితో పాటు కొట్టుకుపోతాయి. దీనివల్ల భూమి సారం తగ్గిడం వలన ప్రస్తుతం రైతులు రసాయనాలను వాడవలసి వస్తోంది. చెట్లను నాటడం అవసరం. వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయేలా ఇంకుడుగుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఇటుఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పంట సంజీవని పథకం ద్వారా పదిలక్షల పంట కుంటల త్రవ్వకానికి నడుం కట్టింది. అటు తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పేరుతో పర్యావాణన్ని కాపాడుకుందాం ,చెట్లను నాటుదం అనే నినాదం ఇచ్చింది. సహజ వనరులను కాపాడుకుంటూ, ప్రకృతి తో ఏకమై ప్రశాంతంగా జీవీస్తూ మన పరిసరాలని పచ్చగా , పరిశుభ్రం గా ఉంచుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు