ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

టిఎస్ఆర్టీ బలోపేతానికి ప్రభుత్వ చర్యలు

తెలంగాణ ఆర్టీసికి తక్షణ సాయంగా రూ. 300 కోట్లు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ. 350 కోట్ల రుణాన్ని ఆర్టీసికి ఇప్పించాలని అధికారులకు సూచించారు. టిఎస్ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నందున అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేసి సంస్థను లాభాల బాట పట్టించాలని ఆర్టీసీపై మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండి జెవి రమణారావు తదితరులతో గురువారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు.
 బస్సు పాసుల కోసం ఇస్తున్న రూ. 500 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని దీనికి సంబంధించిన డబ్బులను వెంటవెంటనే విడుదల చేయాలని , జిహెచ్ఎంసి రూ. 190 కోట్ల వరకు భరిస్తున్నదని, ఈ రెండు చర్యల వల్ల ఆర్టీసికి ఏటా వచ్చే రూ. 700 కోట్ల నష్టం పూడుతుందని సిఎం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసిని లాభాల బాట పట్టించాలని కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు