ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సీఎం దత్తత గ్రామాలు రెడీ




 తెలంగాణా సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. శ్రావణమాసం(ఆగస్టు)లో డబుల్బెడ్రూం ఇండ్లలోకి గృహప్రవేశం చేయాలన్న సీఎం ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. రెండు గ్రామాల్లోని 550 ఇండ్లలో 350 పూర్తయ్యాయి. డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, ఎల్ఈడీ వీధిలైట్ల బిగింపు, మిషన్ భగీరథ పనులు పూర్తి కావొస్తున్నాయి. బిందుసేద్యం కోసం పైపుల బిగింపు, ఏడు సంపుహౌజ్లు, 14 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది. 
-
రూపుమారుతున్న ఎర్రవల్లి, నర్సన్నపేట .. 
-
శ్రావణమాసంలో సామూహిక గృహప్రవేశాలు
70 బోర్లతోపాటు, చేబర్తి చెరువు, చెక్డ్యాముల్లోకి వచ్చే నీటిని చెరువుల్లోకి పంపింగ్ చేసే ఏర్పాట్లుచేశారు. సాగునీటి కొరతను అధిగమించేందుకు నిర్మిస్తున్న పాండురంగసాగర్, నాలుగు కుంటల మరమ్మతులు కొనసాగుతున్నాయి. నర్సన్నపేట శివారు కూడవెల్లి వాగుపై ఐదు చెక్డ్యాముల్లో రెండింటి పనులు పూర్తవుతున్నాయి. వీటితో 190 ఎసీటీఎఫ్ నీళ్లు నిల్వ ఉండనున్నాయి. సంప్హౌజ్ ఆపరేటర్ కోసం గదిని నిర్మిస్తున్నారు. ఇందులో ఎరువులను నిల్వచేయనున్నారు. ఎర్రవల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.ఐదు కోట్లు డిపాజిట్ చేశారు.మొక్కజొన్నకు ఎకరాకు రూ.15 వేలు,సోయాబీన్కు ఎకరాకు రూ. 12వేల చొప్పున పంటరుణాలు ఇస్తున్నారు.
రెండుగ్రామాల్లో 2800 ఎకరాల్లో సమీకృత బిందు సేద్యంలో భాగంగా రెండువేల ఎకరాల్లో మొక్కజొన్న, 800 ఎకరాల్లో సోయాబీన్ సాగుచేయనున్నారు. 42 మంది నిరుపేదలకు ట్రాక్టర్లు పంపిణీ చేయగా భూమి చదును చేశారు. గురువారం నుంచి విత్తనాలు నాటుతున్నారు. ఎర్రవల్లిలో 1000 మంది కూర్చునేలా, చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకునేలా ఫంక్షన్హాల్ నిర్మాణం పూర్తవుతున్నది. ఆగస్టులో ఇంటింటికి రెండు బర్రెలు, 10 కోళ్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..