ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంక్షోభంలో ఉన్న పరిశ్రమలకు ఆపన్న హస్తం

సంక్షోభంలో వున్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు విద్యుత్ ఛార్జీలలో రాయితీలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వస్త్ర, ఉక్కు పరిశ్రమల యాజమాన్యాలకు, పనిచేస్తున్న కార్మికులకు ఊరటనిచ్చే దిశగా సిఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్పిన్నింగ్ మిల్లులు ప్రస్తుతం చెల్లించే యూనిట్ విద్యుత్ ఛార్జీలను రూ. 2 లకు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్ విద్యత్ ధరను రూ. 1.50 పై తగ్గిస్తూ సిఎం ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, అదనపు కార్యదర్శి శాంతి కుమారిలతో సిఎం ఈ మేరకు చర్చలు జరిపారు.
కాగా రాష్ట్రంలోని వివిధ స్పిన్నింగ్ మిల్లులలో దాదాపు 40 వేల మంది, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రల్లో దాదాపు 5 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు మఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏడాది కాలం పాటు అమలులో ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు