ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పునరంకిత సభ

చంద్ర బాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రారంబించారు . ఈ  కార్యక్రమం విజయవాడ లోని బెంజ్ సర్కిల్ లో కొనసాగింది . రాష్ట్ర విబజన ,అబిరుద్ది దిశగా చర్చించుకోవాలని జూన్ 3 నుంచి 8 జూన్ వరకు ఈ కార్యక్రమానాలు జరుగుతాయని ,జూన్ 8 వ తేది పునరంకిత  సభ తో ముగుస్తుందని చెప్పారు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు టి డి పి తీసుకొచ్చిందని  చెబుతున్నారు .


 పెప్సికో - శ్రీ సిటీలో ఏప్రిల్ 3, 2015న రూ.1600 కోట్లతో నిర్మించిన పెప్సికో ప్లాంటును జాతికి అంకితం చేశారు చంద్రబాబు. రూ.1200 కోట్ల వ్యయంతో చేపట్టిన పెప్సికో సంస్థ తొలి యూనిట్ పనిని ప్రారంభించింది. అంతకు ముందు దావోస్ 2015 సమావేశాలలో పెప్సీ సంస్థ తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి శుద్ధి ప్లాంటును పెట్టేందుకు కూడా ప్రతిపాదించింది. మొత్తమ్మీద పెప్సికో సంస్థ ద్వారా 8000 ఉద్యోగాలు రానున్నాయి. 
క్యాడ్ బరీ - ప్రఖ్యాత చాక్లెట్ ఉత్పత్తుల తయారీ సంస్థ మాండలేజ్ (పాత పేరు క్యాడ్ బరీ) 

పసిఫిక్ ఆసియా లోనే అతిపెద్ద ప్లాంటును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పనుంది. రూ. 1000 కోట్ల పెట్టుబడితో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీ సిటీ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్లాంటును స్థాపిస్తున్నారు. ఉత్పాదక ప్లాంటు గానే కాకుండా దీనిని ఎగుమతుల కేంద్రంగా కూడా తీర్చిదిద్దనున్నారు. ఈ మల్టీ కేటగిరీ ఫుడ్ క్యాంపస్ లో చాక్లెట్లతో పాటు బిస్కట్లు, పానీయాలు, క్యాండీలు కూడా తయారవుతాయి
కెల్లొగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - చిత్తూరులో రూ.338 కోట్లతో చాకోస్, ఓట్స్ వంటి రెడీ టు ఈట్ ఆహార ఉత్పత్తుల విభాగాన్ని ప్రారంభించింది. దీనివల్ల 360 మందికి ఉపాధి లభించింది
బ్రిటానియా - చిత్తూరు జిల్లాలో రూ.145 కోట్లతో అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే భూ కేటాయింపులు జరిగాయి. దీనివల్ల వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి. తొలిదశ ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ప్రారంభిస్తారు
ఏపీకి తరలివచ్చిన మరికొన్ని ప్రసిద్ధ సంస్థలలో గోద్రెజ్ అగ్రోవెట్, ఆంధ్రా షుగర్స్, గోడ్ ఫ్రెయ్ ఫిలిప్స్, పెన్నార్ ఆక్వా ఎక్స్ పోర్ట్స్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ వంటివి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్, నెల్లూరు జిల్లాకు ఫెడోర సీఫుడ్స్, తూర్పు గోదావరి జిల్లాకు సీపీఎఫ్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్, సీపీ ఆక్వాకల్చర్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ తదితర సంస్థలు వచ్చాయి.
ఇక రానున్న అగ్రో & ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలలో అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ.90 కోట్ల పెట్టుబడితో 900 మందికి ఉపాధి ఇవ్వనుంది. ఒలం అగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రూ.20కోట్లతో జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. మరో సంస్థ పెన్వెర్ ప్రొడక్ట్స్ రూ.50 కోట్లతో నెలకొల్పనున్న ఆక్వా ప్రాసెసింగ్ ద్వారా 2,000 మందికి ఉపాధి అందనుంది. రుచి సోయా ఇండస్ట్రీస్, ముల్పురి ఆక్వా, చరోన్ పోక్ఫాండ్ గ్రూప్ సంస్థలు కూడా రాష్ట్రానికి త్వరలో రానున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.