ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పునరంకిత సభ

చంద్ర బాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రారంబించారు . ఈ  కార్యక్రమం విజయవాడ లోని బెంజ్ సర్కిల్ లో కొనసాగింది . రాష్ట్ర విబజన ,అబిరుద్ది దిశగా చర్చించుకోవాలని జూన్ 3 నుంచి 8 జూన్ వరకు ఈ కార్యక్రమానాలు జరుగుతాయని ,జూన్ 8 వ తేది పునరంకిత  సభ తో ముగుస్తుందని చెప్పారు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు టి డి పి తీసుకొచ్చిందని  చెబుతున్నారు .


 పెప్సికో - శ్రీ సిటీలో ఏప్రిల్ 3, 2015న రూ.1600 కోట్లతో నిర్మించిన పెప్సికో ప్లాంటును జాతికి అంకితం చేశారు చంద్రబాబు. రూ.1200 కోట్ల వ్యయంతో చేపట్టిన పెప్సికో సంస్థ తొలి యూనిట్ పనిని ప్రారంభించింది. అంతకు ముందు దావోస్ 2015 సమావేశాలలో పెప్సీ సంస్థ తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి శుద్ధి ప్లాంటును పెట్టేందుకు కూడా ప్రతిపాదించింది. మొత్తమ్మీద పెప్సికో సంస్థ ద్వారా 8000 ఉద్యోగాలు రానున్నాయి. 
క్యాడ్ బరీ - ప్రఖ్యాత చాక్లెట్ ఉత్పత్తుల తయారీ సంస్థ మాండలేజ్ (పాత పేరు క్యాడ్ బరీ) 

పసిఫిక్ ఆసియా లోనే అతిపెద్ద ప్లాంటును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పనుంది. రూ. 1000 కోట్ల పెట్టుబడితో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీ సిటీ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్లాంటును స్థాపిస్తున్నారు. ఉత్పాదక ప్లాంటు గానే కాకుండా దీనిని ఎగుమతుల కేంద్రంగా కూడా తీర్చిదిద్దనున్నారు. ఈ మల్టీ కేటగిరీ ఫుడ్ క్యాంపస్ లో చాక్లెట్లతో పాటు బిస్కట్లు, పానీయాలు, క్యాండీలు కూడా తయారవుతాయి
కెల్లొగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - చిత్తూరులో రూ.338 కోట్లతో చాకోస్, ఓట్స్ వంటి రెడీ టు ఈట్ ఆహార ఉత్పత్తుల విభాగాన్ని ప్రారంభించింది. దీనివల్ల 360 మందికి ఉపాధి లభించింది
బ్రిటానియా - చిత్తూరు జిల్లాలో రూ.145 కోట్లతో అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే భూ కేటాయింపులు జరిగాయి. దీనివల్ల వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి. తొలిదశ ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ప్రారంభిస్తారు
ఏపీకి తరలివచ్చిన మరికొన్ని ప్రసిద్ధ సంస్థలలో గోద్రెజ్ అగ్రోవెట్, ఆంధ్రా షుగర్స్, గోడ్ ఫ్రెయ్ ఫిలిప్స్, పెన్నార్ ఆక్వా ఎక్స్ పోర్ట్స్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ వంటివి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్, నెల్లూరు జిల్లాకు ఫెడోర సీఫుడ్స్, తూర్పు గోదావరి జిల్లాకు సీపీఎఫ్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్, సీపీ ఆక్వాకల్చర్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ తదితర సంస్థలు వచ్చాయి.
ఇక రానున్న అగ్రో & ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలలో అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ.90 కోట్ల పెట్టుబడితో 900 మందికి ఉపాధి ఇవ్వనుంది. ఒలం అగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రూ.20కోట్లతో జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. మరో సంస్థ పెన్వెర్ ప్రొడక్ట్స్ రూ.50 కోట్లతో నెలకొల్పనున్న ఆక్వా ప్రాసెసింగ్ ద్వారా 2,000 మందికి ఉపాధి అందనుంది. రుచి సోయా ఇండస్ట్రీస్, ముల్పురి ఆక్వా, చరోన్ పోక్ఫాండ్ గ్రూప్ సంస్థలు కూడా రాష్ట్రానికి త్వరలో రానున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు