ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో అన్నింటికన్నా ముఖ్యమైనది డయాఫ్రం వాల్నిర్మాణమే. గోదావరిలో 40 నుంచి 100 మీటర్ల లోతు వరకు వెళ్లి డయాఫ్రం వాల్నిర్మించుకుంటూ రావాల్సి వస్తుంది. ప్రాజెక్టు స్పిల్వే నిర్మాణం పూర్తయ్యే సమయానికి ఇందులో అవసరమైన 48 గేట్లు సిద్ధంగా ఉండాలని ప్రణాళిక రూపొందించారు. 2017 చివరినాటికి 48 గేట్ల నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రంవాల్నిర్మాణ పనులు, ప్రాజెక్టులో 48 గేట్ల ఫ్యాబ్రికేషన్పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

2018 నాటికి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తామని చంద్రబాబు తెలిపారు. 2019 నాటికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 52 శాతం మట్టి తవ్వకాలు పూర్తయ్యాయని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు మిగతా పనులు జరుగుతున్న ప్రదేశాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించి పనులను పర్యవేక్షించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు