ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎన్టీఆర్‌ సక్సెస్‌ ఫార్ములా


అగ్గిరాముడు (1954) మొదలుకుని ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలకు రాముడు అన్న పేరు తగిలించడం, సినిమా విజయవంతం కావడం ఒక సెంటిమెంటుగా ఉండేది. అడవిరాముడు సినిమాతో సెంటిమెంటు మరింత గాఢంగా పరిశ్రమను ఏలింది. దాంతో ఎన్టీఆర్ సినిమా రాముడయి పోయారు. అలాంటి చిత్రాలలో ఒకటి డ్రైవర్ రాముడు చిత్రం. నందమూరి హరికృష్ణ, తారకరామా ఫిలిం యూనిట్ పతాకంపై 1979లో నిర్మించిన సినిమాను, ఆనాడు 35 కేంద్రాలలో విడుదల చేయగా 14 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, రెండు కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ చేసుకుంది.
ప్రతి సినిమాను వ్యాపారపరంగానే నిర్మించినా అందులో ఎంతో కొంత సామాజిక సందేశాన్ని ఇవ్వందే ఊరుకోరు ఎన్టీఆర్. లారీ యజమానుల అవినీతి వ్యాపారాలకు డ్రైవర్ లు ఎలా బలవుతుంటారు, మద్యపాన వ్యసనం, ఇతరులను మోసగించి బతకడం వంటివి ఎలాంటి అనర్థాలను కొనితెస్తాయో చిత్రంలోని రాము పాత్ర ద్వారా చెప్పిస్తారు ఎన్టీఆర్. అలాగే అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి అద్దంపడుతూ ఎన్టీఆర్, రోజారమణిలపై చిత్రీకరించిన ''ఏమని వర్ణించనూ...'' అంటూ సాగే ఒక పాట అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ రక్తసంబంధానికి ప్రతీకగా నిలిచిపోతుంది.

చిత్రంలో తాను పోషించింది లారీ డ్రైవర్ పాత్రనే అయినా కోటు ధరించి, బెల్ బాటం ఫ్యాంట్ కు లావాటి బెల్టు పెట్టి, రెండు కాలర్ లు పైకి కనిపించేలా అప్పటి ఫ్యాషన్ కు తగ్గట్టుగా ఆధునికంగా కనిపిస్తారు ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ పాత్రకు 1975లో విడుదలైన 'వైట్ లైన్ ఫీవర్' అనే ఆంగ్ల చిత్రం స్ఫూర్తి అంటారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

లోక్సభ స్పీకర్ -సుమిత్ర మహాజన్

లోక్సభ స్పీకర్ గా బి జె పి సీనియర్ నాయకురాలు సుమిత్ర మహాజన్ ఎంపిక లాంచన ప్రాయమే నని తెలుస్తుంది . స్పీకర్ ఎన్నిగా ఏకగ్రీవంగా జరగటం సంప్రదాయంగా వస్తుంది . వివిధ పార్టీలతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక గురించి  సంప్రదింపులు జరుపుతున్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖా  మంత్రి వెంకయ్య నాయుడు చెప్పరు.