ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన -యువకులకు ఉద్యోగావకాశాలు :కె. చంద్రశేఖర్ రావు

గురుకుల విద్యాసంస్థల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, గతంలో అనుసరించిన విధానాలు, న్యాయస్థానాల తీర్పులను అనుసరించే మార్గదర్శకాలను రూపొందించి పాటించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన జరగడం, నిరుద్యొగ యువకులకు ఉద్యోగావకాశాలు రావడం లక్ష్యంగా నియామకాలు జరగాలని ఆదేశించారు. ఎన్.సి.టి.ఇ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సిఎం ఆదేశించారు. ఖచ్చితంగా 60 శాతం మార్కులు ఉండాలనే నిబంధన తొలగించాలని ఆదేశించారు. దీనివల్ల ఎక్కువ మంది నిరుద్యోగులకు పరీక్ష రాసే అవకాశం కలుగుతుందన్నారు. పీజీటీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలనే నిబంధన కూడా తొలగించాలని సిఎం ఆదేశించారు. డిగ్రీ, బిఇడి, టెట్ అర్హత ఉన్నవారందరికీ ఎలాంటి అనుభవం లేకపోయినా అవకాశం ఇవ్వాలని సిఎం సూచించారు. తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహించాలనే విజ్ఞప్తిపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఎన్.సి.టి.ఇ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పులను పరిశీలించారు. దీని ప్రకారం ఏ మీడియం విద్యార్థులకు ఏ మీడియంలో బోధించడానికి నియామకాలు జరుగుతున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియంలో పరీక్ష రాసే అవకాశం లేనందున అభ్యర్థులు ఇంగ్లీషు మీడియంలోనే రాయాలని సిఎం సూచించారు. వీటికి అనుగుణంగా తాజా మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం