ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రతిభ

మెడిసిన్లో 40 సీట్లు, బిడిఎస్ లో 20 సీట్లు సాధించడంతో పాటు ఉన్నత విద్యకోసం జరిగిన అనేక పోటీ పరీక్షల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య, భోజనం, వసతి, శిక్షణ అందించడంలో అంకితభావంతో కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను అభినందించారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం తప్పక ఫలితం ఇస్తుందని నిరూపించారన్నారు. ఈ ఏడాది ఎంసెట్లో ఎస్సీ గురుకులాలకు చెందిన 40 మంది విద్యార్థులు ఎంబిబిఎస్ లో, 20 మంది విద్యార్థులు బిడిఎస్ లో ప్రవేశం పొందే విధంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యాలయాల నుంచి నలుగురైదుగురికి మించి ఎంపికైన సందర్బాలు లేవు. ఇవే విద్యాసంస్థల నుంచి 25 మంది విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఆరుగురు టిఐఎస్ఎస్ లో, 11 మంది అజీంప్రేమ్ జీ సంస్థలో, 45 మంది ఐఐటిల్లో, నిట్ లో, ఐదుగురు సిఎ కోర్సులో ప్రవేశం పొందారు. ఎస్టీలకు చెందిన విద్యార్థులు కూడా 9 మంది మెడిసిన్లో, నలుగురు బిడిఎస్ లో, 50 మంది ఐఐటి, నిట్స్ లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇంత గొప్ప ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. విద్యార్థుల చదువు ప్రగతికి మార్గం వేస్తుందని నమ్మే ప్రభుత్వానికి ఈ పిల్లలు సాధించిన విజయం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాలను చూసిన తర్వాతే మైనారిటీలకు కూడా పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు. సమాజంలో అణగారిన వర్గాలకు మంచి విద్య అందించడానికి ప్రభుత్వం మరింత ఎక్కువ కార్యక్రమాలు తీసుకుంటుందని, ఈ విషయంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని సిఎం చెప్పారు. విద్యార్థులు సాధించిన విజయానికి తాను ఎంతో సంతోషపడుతున్నానని, విద్యా సంస్థలను అంకితభావంతో నడుపుతున్నారని ప్రవీణ్ కుమార్ కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభినందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..