ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హరితహారం సమీక్ష

హరితహారం కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ ఏడాది 40 కోట్ల మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటికే రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలు నాటినట్లు సిఎంఒ స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఓఎస్డి ప్రియాంక వర్గీస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే నాటిన మొక్కలను భవిష్యత్తులోనూ రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని, మంత్రులు, కలెక్టర్లు, ఎస్.పి, ఫారెస్ట్ అధికారులు హరితహారం నిరంతర కార్యక్రమంగా పరిగణించి ప్రణాళిక రూపొందించుకోవాలని సిఎం సూచించారు. మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉంటే 90 కిలోమీటర్ల చొప్పున ప్లాంటేషన్, సంరక్షణను పర్యవేక్షించాలని పేర్కోన్నారు.
మొక్కలకు నీళ్లు పోసే ప్రక్రియ కోసం ఫైర్ ఇంజన్లు, ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్వాహకులు మొక్కల పెంపకం విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారి మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫారెస్ట్ రిజ్వోనేషన్ ను పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. జిల్లాల పర్యటనలో తాను హరితహారం ప్రగతిని ఖచ్చితంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి పేర్కోన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. నర్సింగ్ రావు, సిఎం అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..