ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రజలు అప్రమత్తంగా ఉండండి :కె. చంద్రశేఖర్ రావు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో వర్షాలు, దాని వల్ల సంభవించిన పరిణామాలపై సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం, అధికారులతో మాట్లాడారు. హుస్సేన్‌సాగర్ తో పాటు అన్ని చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రమాదాలను నివారించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలని, ప్రజలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు సూచనులు చేయాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే డిజాస్టర్ మేనేజ్ మెంట్, పోలీస్, ఆర్మీ సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. నగరంలో కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారం ప్రకారం వెంటనే స్పందించాలని కోరారు. రాబోయే రెండు మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అంటూ రోగాలు ప్రబల కుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు