ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకం కావాలి

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సహాయం, అమలు చేయాల్సిన కార్యక్రమాల విషయంలో చొరవ చూపాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రజా ప్రతినిధులంతా రాజకీయాలకతీతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి కేంద్రం నుంచి అందాల్సిన పథకాలు, నిధులు, ఇతర సహాయం సకాలంలో రావాలని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, సహచర మంత్రులతో మాట్లాడి పెండింగ్ లో వున్న పనుల విషయంలో తగిన చొరవ చుపాలన్నారు.
ఢిల్లీలోని దత్తాత్రేయ నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం ఆయనను కలిశారు. మంత్రి చందూలాల్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, డి. శ్రీనివాస్, లోక్ సభ నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంపి వినోద్ కుమార్, ఇతర ఎంపీలు, ఎమ్మేల్యేలు ముఖ్యమంత్రి వెంట వున్నారు.
కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో వున్న పనుల జాబితాను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి అందించారు. వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన రెండో విడత ఆర్థిక సహాయం విడుదలయ్యేలా చూడాలని కోరారు. రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంటు పునరుద్ధరణ ప్రధాన మంత్రి స్వయంగా శంఖుస్థాపన చేసినందున, వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా కేంద్ర మంత్రులతో మాట్లాడి పెండింగ్ పనులు త్వరగా జరిగేలా చూస్తానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రానికి సానుభూతి, ప్రేమ వున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ పట్ల ప్రధాని సహా కేంద్రంలో అందరికీ ప్రత్యేక అభిమానం, గౌరవం వున్నాయన్నారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీల వ్యవహారశైలిపై ప్రభుత్వానికి, స్పీకర్ కు సంతృప్తి వుందన్నారు. భారతదేశానికి సంబధించిన విధానపరమైన చర్చల్లో తెలంగాణ ఎంపీలు క్రియాశీలక పాత్ర పోషించడం అందరి మన్ననలు పొందిందని కేంద్ర మంత్రి ప్రశంసించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..