ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష

భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోంటూనే, ఈ అనుభవాలను భవిష్యత్తులో అనర్థాలు జరుగకుండా తీసుకునే చర్యలకు నేపథ్యంగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి. హరీష్ రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా, కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు, జిల్లాకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అప్పర్ మానేరు నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడం వల్ల ఎంఎండికి ఇబ్బంది కలిగిందన్నారు. దశాబ్ధ కాలంగా ఎంఎండి పనులు జాప్యం కావడం వల్లే అనర్థం జరిగిందని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు. పనుల్లో జాప్యం చేసిన వర్కింగ్ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిడ్ మానేరు ఆనకట్ట 130 మీటర్ల దెబ్బతిన్నదని, ఇకపై వరదలు వచ్చినా పెద్దగా నష్టం లేదని అధికారులు చెప్పారు. ఇకపై ప్రమాదం వుండదు కాబట్టీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారిని తిరిగి తమ గ్రామాలకు తరలించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
వర్కింగ్ ఏజెన్సీలు తమకు అప్పగించిన పనులు సకాలంలో జరిగేటట్లు అవసరమైన నిబంధనలు రూపొందించాలన్నారు. 5% మించిన లెస్ కు పోకుండా చూడాలని, లెస్ టెండర్లు వేసినప్పుడు అంతమొత్తం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నీటి పారుదల శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు చేస్తున్నందున పనుల్లో వేగం అవసరం అన్నారు. 123 జీవో కింద మంచి పరిహారం ఇస్తున్నందున భూసేకరణ/ కొనుగోలు త్వరితగతిన కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్ మానేరు చాలా కీలకమైంది కాబట్టి, దాని పనులు నాణ్యతతో వేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చెప్పారు.
గోదావరి వరదల నేపథ్యంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు అప్రమత్తంగా వుండాలన్నారు. వరంగల్ జిల్లా రామన్నగూడెం, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద మరింత అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రాజెక్టుల వద్ద పెరుగుతున్న ఇన్ ఫ్లోలకు అనుగుణంగా ఔట్ ఫ్లో పెంచాలన్నారు. ఎల్ఎండి నుంచి విడుదలయ్యే నీరు ఖమ్మం, నల్లగొండ జిల్లాల దాకా చేర్చాలని సిఎం ఆదేశించారు. మహారాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వరద పరిస్థితిని అంచనా వేసి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
కర్ణాటక నుంచి వచ్చే వరదను బట్టి సింగూరు ప్రాజెక్టు ఔట్ ఫ్లోను ఎప్పటికప్పుడు నిర్ణయించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు.
భారీ వర్షాలు కురవడం వల్ల రాష్ట్రంలోని చెరువులన్నీ నిండాయిని, అలుగు పోస్తున్నాయని సిఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పనులు చేసిన చెరువులలో ఒక్క కట్టకూ ఇబ్బంది కలుగకపోవడం గమనార్హం అన్నారు. మిషన్ కాకతీయ పనుల వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరింగిందని, కట్టలు బల పడ్డాయనీ సిఎం అన్నారు.
ఈ పరిస్థితిని ప్రజలు గమనించారని సిఎం చెప్పారు. ఇంతకన్నా తక్కువ వర్షం, తక్కువ వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా వందలాది చెరువు కట్టలు తెగిపోయిన సందర్భాలున్నాయన్నారు. మిషన్ కాకతీయకు ప్రశంసలు వస్తున్నాయని సిఎం చెప్పారు.
వర్షాలు, వరదల వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలని, ముఖ్యంగా మనుషులు, పశువుల ప్రాణాలు కాపాడడానికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని సిఎం సూచించారు. జరిగిన నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని సూచించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు