ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష

భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోంటూనే, ఈ అనుభవాలను భవిష్యత్తులో అనర్థాలు జరుగకుండా తీసుకునే చర్యలకు నేపథ్యంగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి. హరీష్ రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా, కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు, జిల్లాకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అప్పర్ మానేరు నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడం వల్ల ఎంఎండికి ఇబ్బంది కలిగిందన్నారు. దశాబ్ధ కాలంగా ఎంఎండి పనులు జాప్యం కావడం వల్లే అనర్థం జరిగిందని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు. పనుల్లో జాప్యం చేసిన వర్కింగ్ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిడ్ మానేరు ఆనకట్ట 130 మీటర్ల దెబ్బతిన్నదని, ఇకపై వరదలు వచ్చినా పెద్దగా నష్టం లేదని అధికారులు చెప్పారు. ఇకపై ప్రమాదం వుండదు కాబట్టీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారిని తిరిగి తమ గ్రామాలకు తరలించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
వర్కింగ్ ఏజెన్సీలు తమకు అప్పగించిన పనులు సకాలంలో జరిగేటట్లు అవసరమైన నిబంధనలు రూపొందించాలన్నారు. 5% మించిన లెస్ కు పోకుండా చూడాలని, లెస్ టెండర్లు వేసినప్పుడు అంతమొత్తం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నీటి పారుదల శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు చేస్తున్నందున పనుల్లో వేగం అవసరం అన్నారు. 123 జీవో కింద మంచి పరిహారం ఇస్తున్నందున భూసేకరణ/ కొనుగోలు త్వరితగతిన కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్ మానేరు చాలా కీలకమైంది కాబట్టి, దాని పనులు నాణ్యతతో వేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చెప్పారు.
గోదావరి వరదల నేపథ్యంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు అప్రమత్తంగా వుండాలన్నారు. వరంగల్ జిల్లా రామన్నగూడెం, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద మరింత అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రాజెక్టుల వద్ద పెరుగుతున్న ఇన్ ఫ్లోలకు అనుగుణంగా ఔట్ ఫ్లో పెంచాలన్నారు. ఎల్ఎండి నుంచి విడుదలయ్యే నీరు ఖమ్మం, నల్లగొండ జిల్లాల దాకా చేర్చాలని సిఎం ఆదేశించారు. మహారాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వరద పరిస్థితిని అంచనా వేసి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
కర్ణాటక నుంచి వచ్చే వరదను బట్టి సింగూరు ప్రాజెక్టు ఔట్ ఫ్లోను ఎప్పటికప్పుడు నిర్ణయించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు.
భారీ వర్షాలు కురవడం వల్ల రాష్ట్రంలోని చెరువులన్నీ నిండాయిని, అలుగు పోస్తున్నాయని సిఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పనులు చేసిన చెరువులలో ఒక్క కట్టకూ ఇబ్బంది కలుగకపోవడం గమనార్హం అన్నారు. మిషన్ కాకతీయ పనుల వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరింగిందని, కట్టలు బల పడ్డాయనీ సిఎం అన్నారు.
ఈ పరిస్థితిని ప్రజలు గమనించారని సిఎం చెప్పారు. ఇంతకన్నా తక్కువ వర్షం, తక్కువ వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా వందలాది చెరువు కట్టలు తెగిపోయిన సందర్భాలున్నాయన్నారు. మిషన్ కాకతీయకు ప్రశంసలు వస్తున్నాయని సిఎం చెప్పారు.
వర్షాలు, వరదల వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలని, ముఖ్యంగా మనుషులు, పశువుల ప్రాణాలు కాపాడడానికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని సిఎం సూచించారు. జరిగిన నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని సూచించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..