ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అవలక్షణాలు లేకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ శాఖల ఏర్పాటు-కేసీఆర్

జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణ కూడా ప్రజలకు ఎక్కువ మేలు చేసే విధంగా ఉండేలా కార్యాచరణ రూపొందిచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణపై శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
భవిష్యత్తులో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి లభ్ధిదారుడి వివరాలు కలెక్టర్లు కంప్యుటర్ లో అందుబాటులో ఉండే విధంగా డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. డిజిటలైజేషన్ లో అనుభవం, అర్హతలున్న ఇంజనీర్లను కలెక్టర్లకు సహాయపడే విధంగా నియమించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవలక్షణాలేవీ లేకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ శాఖలను పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో ఉన్న పద్దతులు, సంప్రదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలను ఏ విధంగా చేరువ చేయాలనే సంకల్పంతో శాఖల డిజైన్ ను రూపొందించాలని సిఎం ఆదేశించారు. 
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించే క్రమంలో అన్ని శాఖలకు క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోవడానికి అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విషయంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రజలే నేరుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించే విధంగా ప్రణాళిక రూపొందిచాలని సూచించారు. గతంలో మాదిరిగా ఉద్యోగులంటే వాళ్లను దొంగల్లా భావించే పద్దతి ప్రభుత్వంలో ఉండకూడదని సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో వాళ్లు కూడా భాగాస్వాములేననే విషయాన్ని మరిచి పోకూడదన్నారు. దురదృష్టవశాత్తు గత సమైక్య పాలనలో ఉద్యోగులను చిన్న చూపు చూసే పరిస్థితి ఉండేదన్నారు. పునర్విభజన ప్రక్రీయలో వీలైనంత వరకు అర్హత ఉన్నవారందరికీ ప్రమోషన్లు ఇచ్చి వారు పూర్తి నిబద్దతతో ప్రజలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న చిన్న అనుబంధ శాఖలన్నింటిని ఒకే గొడుగు క్రిందకు తీసుకురావాలని సూచించారు. ఇరిగేషన్, వ్యవసాయం వంటి కీలక రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సిఎం వివరించారు.
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండాల్సిన ప్రాంతం... గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువుతో తల్లడిల్లే పరిస్థితి వచ్చిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 58 ఏండ్ల చరిత్రలో ఒకే ఒక్క ఏడాది మాత్రమే ఇరిగేషన్ కు 15,500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని అదే ఎక్కువ కేటాయింపులన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి 25 వేల కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని అన్నారు. గతంలో ఏపీకి 13 మంది ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు ఉంటే నేడు ఒక్క తెలంగాణకే 15 మంది సీఈలు ఉన్నారని పేర్కొన్నారు. సమైక్యపాలనలో తెలంగాణలో మొత్తం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న వ్యవసాయ గిడ్డంగులు మాత్రమే ఉంటే... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే 21 లక్షల టన్నుల గిడ్డంగులు నిర్మించేలా ప్రణాళిక రూపొందించామని, ఇప్పుడు వాటి నిర్మాణం వేగంగా జరుగుతున్నదని సిఎం వివరించారు.
నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమైన విషయమని, జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నేరాలను పూర్తి స్థాయిలో అదుపు చేసే చర్యలను తీసుకోవాలని, దానిలో భాగంగానే కొత్తగా ఏర్పడే మండల కేంద్రాలలో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమైన సిబ్బంది నియామకం జరగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరూ పూర్తి సంతోషంగా ఉండేలా కొత్త జిల్లాల ప్రక్రీయ ల్యాండ్ కావాలన్నారు. దసరా రోజు తానూ కొత్తగా ఏర్పడే సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవానికి, తనతో పాటు మంత్రులు, చీఫ్ సెక్రెటరీ, డిజీపి వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతర జిల్లాల్లో పరిపాలన ప్రక్రియను లాంచనంగా ప్రారంభించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లాల పునర్విభజన పురోగతిని చర్చించేందుకు ఈ నెల 6న కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సిఎం అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతకుమారి, సిఎంఓ అధికారులు స్మితాసభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..