ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చిన్న జిల్లాల అభివృద్ధి-సంక్షేమం


“పరిపాలనా విభాగాల కూర్పు సందర్భంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలి. ప్రతీ శాఖలో, ప్రతీ జిల్లాలో సమాన స్థాయిలో ఉద్యోగులు ఉండనక్కరలేదు. జిల్లాల్లో ఆయా శాఖల పనిభారాన్ని బట్టే ఉద్యోగులుండాలి. ఖమ్మం జిల్లాలో సెరికల్చర్ వుంది కాబట్టి అక్కడి సెరికల్చర్ అధికారులుండాలి. రంగారెడ్డి జిల్లాలో హార్టికల్చర్ ఉంది కాబట్టి అక్కడ ఆ శాఖ విస్తరించాలి.
హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలు ఎక్కువ వున్నందున ఆ శాఖ మరింత బాగా పని చేయాలి. ఇలా ప్రతీ శాఖ తమకు ఎక్కువ పనిభారం ఎక్కడ ఉందో గమనించి ఉద్యోగులను సర్దుబాటు చేసుకోవాలి” అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో 64 ప్రభుత్వ శాఖలున్నాయి వాటిలో చాలా శాఖలు ఒకే స్వభావం కలిగినవి. అలాంటి వాటిని ఒకే అధికారి పరిధి కిందికి తేవాలని గతంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికారుల టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల శాఖకు ఒకే జిల్లా అధికారి వుంటారు. వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్ లకు కలిపి ఒకే అధికారిని నియమిస్తారు. విద్యాశాఖలో అన్ని విభాగాలకూ ఒకే అధికారి ఉంటారు. అటవీ శాఖ, సామాజిక అడవులు, వణ్యప్రాణి విభాగాలను కలిపేస్తారు. డి.ఆర్.డి.ఎ, డ్వామా, సెర్ప్ లాంటివన్నీ ఒకే శాఖగా మారతాయి. సంక్షేమ శాఖలు ఒకే గొడుగు కిందికి వస్తాయి. భారీ నీటి పారుదల శాఖ పరిపాలనా విభాగం మాత్రం జిల్లా యూనిట్ గా కాకుండా ప్రాజెక్టుల వారీగా వుంటుంది.
‘‘చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభంగా వుంటుంది, దీని వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అవినీతి, అక్రమాలను తగ్గించవచ్చు. ప్రభుత్వం, అధికారులు తలచుకుంటే ఏమైనా చేయగలరు. పేకాట, గుడుంబా లాంటివి బాగా అరికట్టగలిగాం. మిగతా వాటినీ అలాగే నియంత్రించగలుగుతాం’’ అని సిఎం చెప్పారు.
‘‘భారీ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ వ్యవసాయం బాగా విస్తరిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలను పటిష్టం చేయాలి. మైనారిటీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నందున, వాటిని అమలు చేసే యంత్రాంగం వుండాలి. అభివృద్ది, సంక్షేమ కార్యాక్రమాలన్నింటినీ కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించేలా అధికార వ్యవస్థ వుండాలి. ఎస్సీ, ఎస్టీ, బిసిల కోసం, పేదల జివితాల్లో మార్పు తేవడానికి చేపడుతున్న కార్యక్రమాలు మరింత బాగా అమలు కావడానికి చిన్న జిల్లాలు ఉపయోగపడతాయని నా నమ్మకం’’ అని సిఎం చెప్పారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ ఏర్పాటు కోసం రూ. కోటి చోప్పున, పోలీస్ కార్యాలయాల ఏర్పాటుకు రూ. 50 లక్షల చోప్పున మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, అధికార యంత్రాంగం కూర్పుపై  సమీక్షా సమావేశం మధ్యాహ్నం సెషన్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..