ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హైదరాబాద్ మహా గొప్ప నగరం

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు రోడ్లు ఇతర మౌళిక సౌకర్యాల కల్పనను సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. నగర అభివృద్ధికి బ్యాంకర్ల నుంచి ఆర్ధిక సహాయం తీసుకుని అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ మంత్రి కె.టి. రామారావును, అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో మిషన్ భగీరథ వంటి పథకాలను చేపడుతుండడంతో బ్యాంకర్లలో విశ్వాసం ఏర్పడి రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని సిఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం వ్యాపార రంగంలో ఇంకా అభివృద్ధి దిశగా వేళ్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వరంగ బ్యాంకులను రుణాల కోసం సంప్రదించి పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని సిఎం తెలిపారు. నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
హైదరాబాద్ నగరం ఆదాయం భవిష్యత్ లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మహా గొప్ప నగరంగా రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పది నుంచి పన్నెండు సంవత్సరాలు నిరంతర కృషి చేస్తేనే హైదరాబాద్ విశ్వనగరంగా తయారవుతుందని ఆ దిశగా పూనాది బలంగా వేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత ప్రాతిపదికన చేపట్టడంతో పాటు నగరం చుట్టూ రైతుల భాగస్వామ్యంతో టౌన్ షిప్స్ నెలకోల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. నగరంలో వరదల కారణంగా రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో ఇదే వేగాన్ని కొనసాగించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వచ్చే రాష్ట్ర బడ్జెట్ నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవలి వరదలవల్ల పాడైన రోడ్లను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయిస్తామని సిఎం తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు నగరంలో రెండు రోజుల్లో నాలుగు వందల అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..