ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మిషన్ భగీరథ పనులు-అన్ని గ్రామాలకు మంచినీరు

వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు చేరేలా మిషన్ భగీరథ పనులు జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నదుల నీళ్లు గ్రామాలకు చేరే నాటికి గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, అంతర్గత పైపులైన్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, హనుమంత్ షిండే, జలగం వెంకట్రావు, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇఎన్‌సి సురేందర్ రెడ్డి, సిఇలు సురేష్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో 66,800 ఇండ్లలో నల్లాలు పెట్టి ప్రస్తుతం నీరందిస్తున్నామని, గతంలో చేసిన ప్రయత్నాల వల్ల సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మంచినీళ్లు అందుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోని దాదాపు కోటి ఇండ్లకు నల్లాల ద్వారా మంచినీరు ఇవ్వాలని సూచించారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులు, పైపులైన్ల నిర్మాణం జరగాలని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు నీరు చేరుకుంటుందని, అదే సమయంలో గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సిఎం చెప్పారు. గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణం, ఇండ్లలో నల్లాలు బిగించే పనులు జరగాలని చెప్పారు. దీనికోసం అధికారులంతా సమావేశమై వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. గ్రామాలకు నీరు చేరిన వెంటనే మంచినీటి సరఫరా వ్యవస్థకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను చేపట్టే ఏజన్సీలే పదేళ్ల వరకు నిర్వహించే నిబంధన పెట్టినందున పనుల్లో నాణ్యత ఉంటున్నదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.
నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి మంచినీటి కోసం పది శాతం నీటిని వాడుకోవాలనే విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకన్నందున, దానికి అనుగుణంగా రిజర్వాయర్ల నుంచి నీటిని వాడుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాత ప్రాజెక్టులతో పాటు, కొత్తగా నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల రిజర్వాయర్ల నుంచి నీటిని వాడాలని కోరారు. ఏ రిజర్వాయర్ నుంచి ఎంత నీరు తోడి, ఎక్కడ వాడాలనే విషయంలో స్పష్టత కావాలని, ఇందుకోసం ప్రత్యేకంగా జీవో విడుదల చేయాలని మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించి, కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, నగర ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ శాఖ తరుఫున మంచినీటి సరఫరా జరుగుతున్నదని, కొత్తగా నగర పంచాయితీలుగా మారిన ప్రాంతాల్లో ఆర్.డబ్ల్యు.ఎస్. ద్వారానే నీటి సరఫరా జరగాలన్నారు. ఇందుకోసం కూడా కార్యాచరణ రూపొందించాలని సిఎం ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..