ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యాదాద్రి దేవస్థానం తుది నమూనా ఆమోదముద్ర

వ చ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణ కౌశలంతో దైవభక్తి ఉట్టిపడే విధంగా పవిత్ర శిల్పకళా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. ప్రధాన ఆలయ సమూదాయాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు నిర్మించనున్న వివిధ రకాల కాటేజీల నిర్మాణానికి సంబంధించి త్రీడి వీడియో ఫోటోలను సిఎం వీక్షించారు. సిఎం సూచనల మేరకు ఆగమశాస్త్ర పండితుల నిర్దేశాల మేరకు నిర్మితమవుతున్న ఆలయ కట్టడాల త్రీడి నమూనాల పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవార సిఎం క్యాంపు కార్యాలయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతికి సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐటి శాఖ మంత్రి కె.టి. రామారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, సిఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, యాదాద్రి ఆలయ అభివృద్ది సంస్థ సిఈఓ కిషన్ రావు, ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, బడే రవికిరణ్, ఈఒ గీత తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఐదు రాజగోపురాలతో పాటు ప్రాకార మండపాలను పూర్తిస్థాయి శిలతో నిర్మితం కానున్న ప్రపంచంలోనే మొదటి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలిచిపోనున్నదని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయ సముదాయాన్ని పూర్తిస్థాయి కృష్ణ శిలతో నిర్మితం కావడం విశేషమని సిఎం అభిప్రాయపడ్డారు. 500 మంది నిష్ణాతులైన శిల్పులు యాదాద్రిలో ఇప్పటికే శిల్పాలు చెక్కడంలో, తదితర నిర్మాణ పనులలో నిమగ్నమయ్యారని అధికారుల ద్వారా తెలుసుకున్న సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు.


యాదాద్రిలో భక్తుల బస కోసం నిర్మించ తలపెట్టిన కాటేజీలకు కొన్ని చిన్న చిన్న మార్పులతో ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సిఎం వంటి విఐపిలు దైవ దర్శనార్థం వచ్చినప్పుడు బస చేసేందుకు చేస్తున్న ప్రత్యేక కాటేజీలు ‘‘దైవ సన్నిది’’ నిర్మాణాలను ప్రకృతి రమణీయతతో అడుగడుగునా దైవ సన్నిదిలో సేదతీరిన చందంగా తీర్చిదిద్దడం పట్ల సిఎం అభినందించారు. ఆగమ శాస్త్ర సూత్రాలను తూచా తప్పకుండా తంజావూరు వంటి వేల సంవత్సరాల క్రిందటి సాంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి దేవాలయం ప్రాణ:ప్రతిష్ట పోయనున్నదన్నారు. పూర్తిస్థాయి నిర్మాణాల అనంతరం యాదాద్రి గుట్టపైన వెల్లి విరియనున్న పచ్చదనం తదితర ప్రకృతి రమణీయ సుందర నిర్మాణాలతో ఆలయ పరిసరాల ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 250 ఎకరాల్లో నిర్మితమవనున్న వసతి గృహాల సముదాయాల నిర్మాణానికి మొగ్గు చూపుతూ ఇప్పటికే పలు కార్పోరేటు సంస్థలు ముందుకు రావడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు.


యాదాద్రి దేవస్థాన క్షేత్ర పాలకుడిగా 108 అడుగుల భారీ విగ్రహంతో నిలవనున్న ఆంజనేయ స్వామి పాలరాతి విగ్రహా నమూనాకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇంతటి భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనాకు చెందిన రూపశిల్పులు ముందుకు వచ్చారు. భారీ ఆంజనేయ విగ్రహా నిర్మాణానికి ఆర్కిటెక్చర్ ఆనందసాయి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు త్వరలో చైనాను సందర్శించనున్నారు. పాలరాతితో తయారు చేసిన మోడల్ ప్రతిమను వారికి అప్పగించి భారీ విగ్రహ రూపకల్పనకు నాంది పలకనున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..