ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రజల మధ్యనే వుండాలని ప్రజా ప్రతినిధులకు ఆదేశం

మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదవుతున్నందున హైదరాబాద్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడమే కాకుండా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని వారాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు (పాఠశాలలు, కళాశాలలతో సహ ఇతర విద్యాలయాలు) ముఖ్యమంత్రి సెలవు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి గురువారం హైదరాబాద్ లో పరిస్థితిపై ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ మహెందర్ రెడ్డి, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు రఘనందన్ రావు, రోనాల్డ్ రాస్ లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి తో పాటు నగరానికి చెందిన మంత్రులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం, పోలీస్ శాఖ రేయింబవళ్లు అప్రమత్తంగా వుండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి ప్రజలకు తగు సూచనలు, సలహాలు చేయాలన్నారు. ఎంతటి అసాధారణ పరిస్థితులు వచ్చినా ఏ మాత్రం ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో వున్న వారిని, కూలిపోవడానికి సిద్దంగా వున్న ఇండ్లల్లో వున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, వాటి నంబర్లు ప్రజలకు తెలపాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను 24 గంటలు తీసుకుని వెంటనే స్పందించాలన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాలను సహాయ చర్యల్లో ఉపయోగించుకోవాలన్నారు.


మున్సిపల్ శాఖ మంత్రితో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు, ప్రజల మధ్యనే వుండి పరిస్థితికి అనుగుణంగా స్పందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హుస్సెన్ సాగర్ తో పాటు ఇతర చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పడు మధింపు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలుగని విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ప్రవాహం, వరదల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశానుసారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుతో పాటు ఇతర మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సమావేశమయ్యారు. పరిస్థితిని తెలుసుకుంటూ రాబోయే రెండురోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహన్ని కరారు చేసుకున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..