ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రజల మధ్యనే వుండాలని ప్రజా ప్రతినిధులకు ఆదేశం

మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదవుతున్నందున హైదరాబాద్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడమే కాకుండా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని వారాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు (పాఠశాలలు, కళాశాలలతో సహ ఇతర విద్యాలయాలు) ముఖ్యమంత్రి సెలవు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి గురువారం హైదరాబాద్ లో పరిస్థితిపై ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ మహెందర్ రెడ్డి, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు రఘనందన్ రావు, రోనాల్డ్ రాస్ లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి తో పాటు నగరానికి చెందిన మంత్రులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం, పోలీస్ శాఖ రేయింబవళ్లు అప్రమత్తంగా వుండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి ప్రజలకు తగు సూచనలు, సలహాలు చేయాలన్నారు. ఎంతటి అసాధారణ పరిస్థితులు వచ్చినా ఏ మాత్రం ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో వున్న వారిని, కూలిపోవడానికి సిద్దంగా వున్న ఇండ్లల్లో వున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, వాటి నంబర్లు ప్రజలకు తెలపాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను 24 గంటలు తీసుకుని వెంటనే స్పందించాలన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాలను సహాయ చర్యల్లో ఉపయోగించుకోవాలన్నారు.


మున్సిపల్ శాఖ మంత్రితో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు, ప్రజల మధ్యనే వుండి పరిస్థితికి అనుగుణంగా స్పందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హుస్సెన్ సాగర్ తో పాటు ఇతర చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పడు మధింపు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలుగని విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ప్రవాహం, వరదల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశానుసారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుతో పాటు ఇతర మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సమావేశమయ్యారు. పరిస్థితిని తెలుసుకుంటూ రాబోయే రెండురోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహన్ని కరారు చేసుకున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.