ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆలేరు రైల్వేగేటును తిరిగి తెరిచేందుకు మార్గం

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చొరవతో మూతపడిన నల్గొండ జిల్లా ఆలేరు రైల్వేగేటును తిరిగి తెరిచేందుకు మార్గం సుగమమైంది. రెండు నెలలుగా మూసి ఉన్న రైల్వే గేటు మంగళవారం తెరుచుకోనుంది. ఆలేరు పట్టణంలో ఇటీవలే కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. దాని ఫలితంగా రైల్వే శాఖ ఆలేరు పట్టణంలోని రైల్వే గేటును మూసి వేసింది. అయితే రైల్వే గేటు మూసివేత వల్ల ఆలేరు పట్టణ ప్రజలు అటు ఇటు వెళ్లిరావడానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల నుంచి వరంగల్ జిల్లా బచ్చన్నపేట, కొమురవెల్లి, మెదక్ జిల్లా జగదేవ్ పూర్, రంగారెడ్డి జిల్లా కీసర తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆలేరులో పాత రైల్వే గేటు ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని ఇటీవల విన్నవించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్.యు.బి.కి అయ్యే ఐదు కోట్ల 25 లక్షల వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆర్.యు.బి. నిర్మాణం జరిగే వరకు గేటును తెరవాలని రైల్వే శాఖను కోరారు. దీంతో రైల్వే శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు గేటును తెరవడానికి అంగీకరించింది. దీనికి ముందుగానే ఆర్.యు.బి. నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనే షరతు పెట్టింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదుకోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచి రైల్వే గేటు తెరవాలని నిర్ణయం జరిగింది. ఆర్.యు.బి. నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయడంతో పాటు, రైల్వే గేటు తెరిచేలా రైల్వే శాఖను ఒప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఆలేరు జడ్పిటిసి బొట్ల పరమేశ్వర్, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆకవరపు మోహన్ రావు, ఎంపిటిసి చింతకింది మురళి, సర్పంచ్ దాసి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులను గొంగిడి సునితకు అందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..