ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్ర అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రతిపాదన

విభజన తర్వాత  తెలంగాణ, ఆంధ్ర అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రుల బృందం చురుకుగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాజకీయ సుస్థిరత కోసం విభజన తర్వాత అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నారు.విభజన పై  అన్ని రకాల తాయిలాలను పరిశీలిస్తున్న కేంద్రం...ఇప్పడు మరో అడుగు ముందుకేసింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఇరు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలనే చర్చకు తెరలేపింది. 1966లో పంజాబ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు హర్యానాలో 54 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటి సంఖ్యను 1971లో 90కి పెంచారు. పార్లమెంటు సిఫార్సు మేరకు అసెంబ్లీ సీట్లను పెంచవచ్చు. అలాగే 2000లో ఉత్తరప్రదేశ్‌ను విభజించి ఉత్తరాఖండ్ ఏర్పాటు చేశారు. అప్పటికి 25 అసెంబ్లీ స్థానాలతో ఉన్న ఉత్తరాఖండ్‌ను 2002లో 70 స్థానాలకు విస్తరించారు. జార్ఖండ్‌లో 80 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దీనివల్లే రాజకీయ అస్థిరత్వం రాజ్యమేలుతోందని, ఈ సంఖ్యను 150కు పెంచాలని ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.పార్లమెంటు చట్టం ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాతే లోక్‌సభ సీట్లను పెంచాలి. కాబట్టి లోక్‌సభ సీట్లను పెంచేందుకు అవకాశం లేదు. కాని అసెంబ్లీ స్థానాలను పెంచుకోవచ్చు. వీటిని ఆయా లోక్‌సభ సీట్లలో సర్దుబాట్లు చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో 119, ఆంధ్రాలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. తెలంగాణలో 119 సీట్లను 153కు పెంచాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. అంటే, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో రెండు సీట్లు పెంచవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లోక్‌సభలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రలో కూడా మరో 50 సీట్లను పెంచాలనే డిమాండ్ ఉంది. రెండు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలను కూల్ చేసేందుకు.. రాజకీయ ఉపాధి పెంచేందుకు అసెంబ్లీ స్థానాల పెంపుదలను కేంద్రం తెరపైకి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలు ఇప్పటికిప్పుడు అమలుకాకున్నా, 2019లో జరిగే ఎన్నికలలోపు అసెంబ్లీ స్థానాలను పెంచవచ్చు. జిహెచ్‌ఎంసి పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీలోనే 3.5 లక్షలు, మేడ్చల్ అసెంబ్లీలో 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు అసెంబ్లీలు మల్కాజగిరి లోక్‌సభ పరిధిలో ఉన్నాయి. డీలిమిటేషన్ చట్టం కింద పార్లమెంటు ప్యానెల్‌కు అసెంబ్లీ సీట్లను పెంచేందుకు సిఫార్సులు చేసే అధికారం ఉంద భారత రాజ్యాంగం ప్రకారం ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అసెంబ్లీలో 60 సీట్లు, కేంద్ర పాలిత రాష్ట్రం ఏర్పాటుకు 30 సీట్లు అవసరం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.