ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ

విభజన ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. తాజాగా ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలంతా ... కొత్త పార్టీ పెట్టాలంటూ సీఎం పై ఒత్తిడి పెంచుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ప్రతిపాదనపై మథనపడుతున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీకి వస్తే ... ఆ తదుపరి నిర్ణయం అంటున్న కిరణ్ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇప్పడు హాట్ టాపిక్.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ సర్కార్ వెనక్కి తగ్గకపోవడంతో సీమాంధ్ర లో కాంగ్రెస్ పార్టీ, నేతల పరిస్థితి దయనీయాంగా మారింది. విభజన ప్రక్రియకు కారణం కాంగ్రెస్ పార్టీయేనంటూ నేతలను గ్రామల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు సీమాంధ్ర ప్రజలు. దీనికి తోడు టీడీపీ, వైఎస్ ఆర్ సీపీ కూడా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో తెలియక లోలోపల మథనపడుతున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు