ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జీఓఎం ముందు...రాష్ట్ర కేంద్ర మంత్రులు

రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన జీఓఎం ముందు.... .. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు మళ్లీ తమ పాత వాదనలు వినిపించారు. వీరితో పాటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా జీవోఎంకు రెండు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే... సీమాంధ్ర తో పాటు తెలంగాణలో కూడా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు సీఎం.  హైదరాబాద్, విద్య, ఉద్యోగ సమస్యలు ఉత్పన్నమవుతాయి. నక్షలిజం, మతకలహాలుతో పాటు తీవ్రవాద సమస్యలతో పాటు రెండు రాష్ర్టాల మధ్య జలవిధాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. మావోల కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతం వారేనన్న విషయాన్ని కూడా సీఎం తన నివేదికలు గుర్తు చేశారు. ఢిల్లీలో  కేంద్ర మంత్రుల గ్రూపుతో భేటి అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పలు అంశాలపై లోతుగా చర్చంచారు. మొదటగా రాష్ట్రాన్ని సమైక్యంగా నే ఉంచాలని కోరారు. విభజన అనివార్యమైతే  హైదరాబాద్ ను యూటీ చేయడమో లేక రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయడమో చేయాలన్నారు. HMDA పరిధిలోని హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు ...  భద్రాచలాన్ని సీమాంధ్రకే ఇవ్వాలని జీవోఎంను కోరారు.  హైదరాబాద్ పన్నుల ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు కేటాయించాలన్నారు. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వెనుకబడ్డ జిల్లాలకు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల కోసం కూడా  ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..