ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సీఎం పోస్ట్

రాష్ట్ర ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలు  కొంత మంది కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారురాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వాదనలు ఎలా ఉన్నా... చివరికి కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తలవంచక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అనివార్యమని నేతలు ఒక నిర్ణయానికి వస్తున్నారు. జనవరి నాటికి రెండు రాష్ట్రాలు ఖాయమంటున్న తరుణంలో సీఎం పోస్ట్ ను దక్కించుకునేందుకు తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారుకొత్తగా ఏర్పడబోయే 29వ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ నుంచి పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ప్రముఖంగా సీనియర్ మంత్రి జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.  సీమాంధ్ర నుంచి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పోటీ ఉన్నారని తెలుస్తోంది. ఈ నేతలంతా ఎవరికి వారుగా అధిష్టానం వద్ద తమకున్న పలుకుబడితో పావులు కదుపుతున్నారు. మరి అధిష్టానం మాత్రం ఎవరికి పట్టం కడుతుందో వేచిచూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..