ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సీఎం పోస్ట్

రాష్ట్ర ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలు  కొంత మంది కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారురాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వాదనలు ఎలా ఉన్నా... చివరికి కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తలవంచక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అనివార్యమని నేతలు ఒక నిర్ణయానికి వస్తున్నారు. జనవరి నాటికి రెండు రాష్ట్రాలు ఖాయమంటున్న తరుణంలో సీఎం పోస్ట్ ను దక్కించుకునేందుకు తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారుకొత్తగా ఏర్పడబోయే 29వ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ నుంచి పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ప్రముఖంగా సీనియర్ మంత్రి జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.  సీమాంధ్ర నుంచి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పోటీ ఉన్నారని తెలుస్తోంది. ఈ నేతలంతా ఎవరికి వారుగా అధిష్టానం వద్ద తమకున్న పలుకుబడితో పావులు కదుపుతున్నారు. మరి అధిష్టానం మాత్రం ఎవరికి పట్టం కడుతుందో వేచిచూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.