ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి

 బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి ఘటనపై  దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది . ఏటిఎం దగ్గర  సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్లే ఈ ఘటన  చోటు చేసుకుందని ప్రజా సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి .  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ను కర్నాటక సర్కార్  కూడా సీరియస్ గా  తీసుకుంది .  సీఎం సిద్ధరామయ్య .. సమగ్ర విచారణకు ఆదేశించారు కొడుకు పుట్టిన రోజు ఖర్చుల కోసం డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లిన జ్యోతి పై దుండగుడు విచక్షణారహితంగా గాయపర్చాడు . ఆ దృశ్యాలన్ని  ఏటీఎంలోని సీసీ టీవీ లో రికార్డ్  అయ్యాయి . సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని  బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర తెలిపారు.  ఈ కేసు ఛేదించేందుకు  ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలు పంపించామన్నారు. బాధితురాలు జ్యోతి ఉదయకుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను, ఫుటేజ్ ఆధారంగాను నిందితుడుని పట్టుకోగలమని ధీమా వ్యక్తం చేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు