ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎక్కడ సంపద ఉంటే...అక్కడ దోపిడి

ఇన్ని రోజులు సీమాంధ్ర నేతలను టార్గెట్ చేసిన టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు సీమాంధ్ర అధికారులపై దృష్టి సారించారు. నాయకుల భూ ఆక్రమణలకు అధికారులు సహకరిస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. ఒక్కొక్క ఆక్రమణను, అధికారులు, నాయకుల పేర్లను బయటపెడుతామంటున్నారు. కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కుక్కల వలె వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.


ఎక్కడ సంపద ఉంటే...అక్కడ దోపిడి ఉంటుందనేది నానుడి. హైదరాబాద్ రాజధాని కావడంతో సహజంగానే ఆ ప్రాంతంలోని భూములకు, దాని చుట్టుపక్కల నున్న రంగారెడ్డి జిల్లా భూములకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పాటు హైదరాబాద్ ఐటి హబ్ గా మారడం, రియల్ ఎస్టేట్ బూమ్ రావడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత దశాబ్దకాలంగా నగరంలో భూములకు ఎక్కడ లేని విలువ పెరిగింది. దీంతో నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా భూ ఆక్రమణలు, దందాలు బాగానే చేశారు. అనేక కేసులు నమోదయ్యాయి. ఇది అందరికి కనిపిస్తున్న దందానే. అయితే ఇటీవల గత కొంతకాలంగా టిఆర్ఎస్ నేతలు భూ దందాలపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విభజన జరుగుతున్న సమయంలో సీమాంధ్ర నేతలు, అక్కడి ప్రాంత అధికారుల సహకారంతో ప్రభుత్వానికి చెందిన భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి గత నాలుగైదు నెలలుగా తన సోదరుడి ఆధ్వర్యంలో ఇదే పనిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. ఇట్లాంటి భూ పందేరాలను వదలబోమని, కచ్చితంగా వీటిపై రివ్యూ చేస్తామని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ స్వయంగా హెచ్చరించారు. ఇప్పుడు ఆ పార్టీ టిఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు మరోసారి దీనిపై మరోసారి మాట్లాడారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి కలిసి సచివాలయం అడ్డాగా ఈ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, రెవెన్యూ మంత్రి ఓఎస్ డి ఆధ్వర్యంలో భూ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..