ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గ్యాస్ సిలెండర్ కు ఆధార్ కార్డుకు లింక్

గ్యాస్ సిలెండర్ కు ఆధార్ కార్డుకు లింక్ పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆధార్ కార్డుల విషయమై గ్యాస్ వినియోగదారులను ఇబ్బంది పెట్టొద్దని సూచించింది. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండానే వంట గ్యాస్ సిలెండర్లను సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో చమురు కంపెనీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆధార్ కార్డు లేని కారణంగా గ్యాస్ సబ్సిడీ అందడం లేదని, పోనీ ఆధార్ కార్డు తీసుకుందామంటే... దానికోసం నానా యాతనా పడాల్సి వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా... ఆధార్ కార్డ్ అతీగతీ ఉండడం లేదని వాపోతున్న గ్యాస్ వినియోగదారులకు హైకోర్టు తీర్పు నిజంగా శుభవార్తే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు