ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జీవోఎంతో ముగిసిన తెలంగాణ కేంద్రమంత్రుల భేటీ

భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన GOMతో వారి భేటీ ముగిసింది. భేటీకి జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ హాజరయ్యారు. ముగ్గురు మంత్రులు లిఖిత పూర్వకంగా ఒకే నోట్ ఇచ్చినట్లు సమావేశం అనంతరం వారు వెల్లడించారు. హైదరాబాద్ పై అంక్షలతో ప్రయోజనం ఉండదన్న జైపాల్ రెడ్డి... రెండు ప్రాంతాల ఉద్యోగుల మనోగతం ప్రకారం 371 D ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ సరిపోతుందని, గోదావరిపై ట్రైబ్యునల్ అవసరం లేదన్నారు. తెలంగాణకు విద్యుత్ సమస్య ఉందంటూనే... ప్రస్తుత ఫార్ములా ప్రకారమే విద్యుత్ ఇవ్వాలని అన్నారు. అంతకుముందు తెలంగాణ కేంద్రమంత్రులు... జైపాల్ రెడ్డి నివాసంలో సమైవేశమై...GOM కు అందించాల్సిన నివేదికపై చర్చించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు