ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంటోనీలతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ

 కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, ఆంటోనీలతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. గతంలో తాము ఇచ్చిన విజ్ఞాపనలను మరోసారి గుర్తు చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ముందు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులతో భేటీ అయిన వారిలో కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి,  చిరంజీవి, జేడీ శీలం ఉన్నారు. ఈ నెలాఖరుకి జీవోఎం సిఫారసులను ఖరారు చేస్తామని మొయిలీ చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి జీవోఎం కసరత్తు చేస్తోందని, ఇరు ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపే అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్టు మొయిలీ చెప్పారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు