సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలు ఆడడం మానాలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. టిడిపి మొదటి నుంచి ఒకే విధానంతో ఉందని బాబు తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కు తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయం చేసిందా అని బాబు ప్రశ్నించారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను సచిన్ కు ప్రకటించినందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సచిన్ ఆటతో పాటు గొప్ప విలువలు నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సచిన్ యువతకు ఆదర్శప్రాయమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి