రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్ ను పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకోవడం.. ప్రస్తుత ముఖ్యమంత్రి పదవిని మరో సీమాంధ్ర నేతకు అప్పగిస్తారని ఊహాగానాలు రావడంతో .. ముఖ్యమంత్రి కూడా వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. మొన్న ఢిల్లీ పర్యటనను కూడా అర్థాంతరంగా వాయిదా వేసుకున్న ఆయన రచ్చబండలకు పయనమయ్యారు. రచ్చబండలనే వేదికగా మార్చుకుని సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఇలా ఉంటుందని ప్రసంగాలు ప్రారంభించారు. ఈనెల 18న జీవోఎం భేటీలో కూడా తాను సమైక్యవాదాన్ని వినిపిస్తానని సీఎం ఖరాకండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కొత్త పార్టీ పెడతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇందిరా సమైక్య రాష్ట్ర సమితి పేరుతో త్వరలో పార్టీ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే సీఎం సన్నిహితులు చెప్పుకుంటున్నారు. సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న కిరణ్ కు సీమాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశమున్నందున ఆయన సారథ్యంలోనే కొత్తపార్టీ వస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కూడా రచ్చబండలను సమైక్యవాదానికి వేదిక చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి