ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వ్యూహం మార్చిన ముఖ్యమంత్రి

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్ ను పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకోవడం.. ప్రస్తుత ముఖ్యమంత్రి పదవిని మరో సీమాంధ్ర నేతకు  అప్పగిస్తారని ఊహాగానాలు రావడంతో  .. ముఖ్యమంత్రి కూడా వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. మొన్న ఢిల్లీ పర్యటనను కూడా అర్థాంతరంగా వాయిదా వేసుకున్న ఆయన రచ్చబండలకు పయనమయ్యారు. రచ్చబండలనే వేదికగా మార్చుకుని సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఇలా ఉంటుందని ప్రసంగాలు ప్రారంభించారు. ఈనెల 18న జీవోఎం  భేటీలో కూడా తాను సమైక్యవాదాన్ని వినిపిస్తానని సీఎం ఖరాకండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కొత్త పార్టీ పెడతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇందిరా సమైక్య రాష్ట్ర సమితి పేరుతో త్వరలో పార్టీ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే సీఎం సన్నిహితులు చెప్పుకుంటున్నారు. సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న కిరణ్ కు సీమాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశమున్నందున ఆయన సారథ్యంలోనే కొత్తపార్టీ వస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కూడా రచ్చబండలను సమైక్యవాదానికి వేదిక చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు