జల సంరక్షణ, భూగర్భ జలాల వృద్ధి ప్రధాన లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణ కోసం
చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ.5 వేల కోట్ల కేంద్ర సహాయం
అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని
కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కి కేసీఆర్ శనివారం
లేఖ రాశారు. వచ్చే మూడేళ్ల కోసం మిషన్ కాకతీయ కోసం రూ. 5 వేల కోట్ల కేంద్ర
సాయం అందిచాలని నీతి అయోగ్ చేసిన సిపారసులను కూడా ముఖ్యమంత్రి ఈ లేఖ
ద్వారా జైట్లీ కి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కూడా
తెలంగాణ లోని వెనుకబడిన జిల్లాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి అందిచాలని చెబుతోందని సిఎం గుర్తు చేశారు.
చట్టం ప్రకారమే తెలంగాణలో అమలయ్యే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు
రూ. 30,571 కోట్ల ప్యాకేజి ఇవ్వాలని కోరిన విషయాన్ని సిఎం మరోసారి గుర్తు
చేశారు. కేంద్ర జలవనరుల శాఖ ద్వారా దేశ వ్యాప్తంగా జల సంరక్షణ, భూగర్భ జలాల
అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సిఎం అన్నారు. ఇదే
లక్ష్యంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం
చేపడుతున్నట్లు సిఎం వివరించారు. కాబట్టి మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు
ఇవ్వాలని కోరారు. మిషన్ కాకతీయ పురోగతిని, చేపట్టిన కార్యక్రమాలను సిఎం ఈ
లేఖ ద్వారా వివరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి