ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని

ప్రధాన మంత్రి  నరేంద్రమోడీ ఆగస్టు 7 రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయాల్సిందిగా ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానించడం జరిగింది. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఏడవ తేది మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3:00 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్ చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి తో కలిసి పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:30 గంటలకు గజ్వేల్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 6:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు.

ప్రారంభించనున్న కార్యక్రమాల వివరాలు

1.
మిషన్ భగీరథ తొలి దశ ప్రారంభం
2.
ఆదిలాబాద్ జిల్లా జైపూల్ సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు జాతికి అంకితం
3. రామగుండంలో ఎన్.టి.పి.సి ఆధ్వర్యంలో నిర్మించే 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటుకు శంఖుస్థాపన
4.
ఫర్టిలైజర్ ప్లాంటుకు శంఖుస్థాపన
5.
వరంగల్లోని కాలోజి నారయణ రావు హెల్త్ యూనివర్సిటీ ప్రారంభం
6.
మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైన్కు శంఖుస్థాపన
7.
గజ్వేల్లో బహిరంగ సభ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..