ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ మాస పత్రిక ‘ ఇంగ్లీషు భాషలో

తెలంగాణ ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవసరమైన సమాచారం అందించడానికి, విషయ పరిజ్ఞానం పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు అధికార మాస పత్రిక ‘‘తెలంగాణ’’ ఇకపై ఇంగ్లీషు భాషలో కూడా వెలువడడం సంతోషకరమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. . తెంలంగాణ (ఇంగ్లీషు) మాసపత్రిక తొలి కాపీని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కేసిఆర్ ఆవిష్కరించారు. ఆయా అంశాలపై విషయ నిపుణులు, అనుభవజ్ఞులు వెలిబుచ్చే అభిప్రాయాలు ప్రచురించాలని సూచించారు. 
తెలంగాణలో అన్ని అంశాలకు ప్రాధాన్యత, సముచిత స్థానం కల్పించాలన్నారు. తెలంగాణ సంస్కృతికున్న ప్రత్యేక లక్షణాలు, ఆధ్యాత్మిక అంశాలను, సౌభ్రాతృత్వ విశేషాలు అందించాలని చెప్పారు. తెలంగాణ పత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సిఎం ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్, సిఎం పిఆర్ఓలు గటిక విజయ్ కుమార్, రమేష్ హజారి, మిట్ట సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం