ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ మాస పత్రిక ‘ ఇంగ్లీషు భాషలో

తెలంగాణ ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవసరమైన సమాచారం అందించడానికి, విషయ పరిజ్ఞానం పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు అధికార మాస పత్రిక ‘‘తెలంగాణ’’ ఇకపై ఇంగ్లీషు భాషలో కూడా వెలువడడం సంతోషకరమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. . తెంలంగాణ (ఇంగ్లీషు) మాసపత్రిక తొలి కాపీని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కేసిఆర్ ఆవిష్కరించారు. ఆయా అంశాలపై విషయ నిపుణులు, అనుభవజ్ఞులు వెలిబుచ్చే అభిప్రాయాలు ప్రచురించాలని సూచించారు. 
తెలంగాణలో అన్ని అంశాలకు ప్రాధాన్యత, సముచిత స్థానం కల్పించాలన్నారు. తెలంగాణ సంస్కృతికున్న ప్రత్యేక లక్షణాలు, ఆధ్యాత్మిక అంశాలను, సౌభ్రాతృత్వ విశేషాలు అందించాలని చెప్పారు. తెలంగాణ పత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సిఎం ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్, సిఎం పిఆర్ఓలు గటిక విజయ్ కుమార్, రమేష్ హజారి, మిట్ట సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు