ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఈనాడులో పెట్టుబడుల గురించి సాక్షి ప్రముఖంగా ఇస్తుంటే , సాక్షి లో పెట్టుబడులు,జగన్ కంపెనీల గురించిన ఆరోపణలకు ఈనాడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పాఠకులలో ఆసక్తి పెంచడానికి యత్నిస్తున్నాయి. ఈనాడు దినపత్రిక జగన్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టిన పదహారు కంపెనీలకు సంబంధించి డైరెక్టర్ గా ఒకరే అన్నిటిలోను ఉన్నారన్న కొత్త విసయం బయటకు వచ్చిందని ఈనాడు మొదటి పేజీలో ప్రచురించింది. ప్రభుత్వం లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు వచ్చిన వసూళ్లను మళ్లించడానికే ఇలా చేసి ఉండవచ్చని ఈనాడు పేర్కొంది. కాగా ఈనాడులో రిలయన్స్ లో పెట్టుబడులు చాలా రహస్యంగా ఉంచారని, ఇది రిలయన్స్ షేర్ హోల్డర్లను మోసం చేయడమేనని సాక్షి రాసింది. సెబి దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన ప్రాధమిక సాక్ష్యాధారాలు దొరికాయని, ఎన్నడూ రిలయన్స్ వార్షిక నివేదికలలో ఈ పెట్టుబడుల గురించి ప్రస్తావించకపోవడమే సాక్ష్యమని తెలిపింది.మొత్తం రెండు కంపెనీలలో పెట్టుబడులలో జరిగిన అవకతవకలే అనండి,లోపాలే అనండి వాటిని ఇరుపక్షాలు తవ్వి తీసుకుంటున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు