ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఈనాడులో పెట్టుబడుల గురించి సాక్షి ప్రముఖంగా ఇస్తుంటే , సాక్షి లో పెట్టుబడులు,జగన్ కంపెనీల గురించిన ఆరోపణలకు ఈనాడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పాఠకులలో ఆసక్తి పెంచడానికి యత్నిస్తున్నాయి. ఈనాడు దినపత్రిక జగన్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టిన పదహారు కంపెనీలకు సంబంధించి డైరెక్టర్ గా ఒకరే అన్నిటిలోను ఉన్నారన్న కొత్త విసయం బయటకు వచ్చిందని ఈనాడు మొదటి పేజీలో ప్రచురించింది. ప్రభుత్వం లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు వచ్చిన వసూళ్లను మళ్లించడానికే ఇలా చేసి ఉండవచ్చని ఈనాడు పేర్కొంది. కాగా ఈనాడులో రిలయన్స్ లో పెట్టుబడులు చాలా రహస్యంగా ఉంచారని, ఇది రిలయన్స్ షేర్ హోల్డర్లను మోసం చేయడమేనని సాక్షి రాసింది. సెబి దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన ప్రాధమిక సాక్ష్యాధారాలు దొరికాయని, ఎన్నడూ రిలయన్స్ వార్షిక నివేదికలలో ఈ పెట్టుబడుల గురించి ప్రస్తావించకపోవడమే సాక్ష్యమని తెలిపింది.మొత్తం రెండు కంపెనీలలో పెట్టుబడులలో జరిగిన అవకతవకలే అనండి,లోపాలే అనండి వాటిని ఇరుపక్షాలు తవ్వి తీసుకుంటున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం