ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఈగ’, ‘మిర్చి’ చిత్రాలకు నంది అవార్డులు


సినీ రంగానికిచ్చే నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2012, 2013 నంది అవార్డుల ఎంపిక కమిటీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదికను అందజేసింది. 2012 సంవత్సర కమిటీకి జయసుధ, 2013 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సినీనటి జయసుధ అవార్డులను ప్రకటించారు. 2012 సంవత్సరానికి గాను ‘ఈగ’, 2013 సంవత్సరానికి గాను ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి.
2012 అవార్డుల వివరాలు
* ఉత్తమ చిత్రం- ఈగ
* రెండో ఉత్తమ చిత్రం- మిణుగురులు
* మూడో ఉత్తమ చిత్రం- మిథునం
* ఉత్తమ దర్శకుడు- ఎస్‌.ఎస్‌.రాజమౌళి(ఈగ)
* ఉత్తమ కథానాయకుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
* ఉత్తమ కథానాయిక- సమంత(ఎటో వెళ్లిపోయింది మనసు)
* ఉత్తమ సహాయనటుడు- అజయ్‌(ఇష్క్‌)
* ఉత్తమ సహాయనటి- శ్యామల(వీరంగం)
* బెస్ట్‌ పాపులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌- జులాయి
* ఉత్తమ గాయకుడు- శంకర్‌ మహాదేవన్‌
* ఉత్తమ గాయని- గీతామాధురి
* ఉత్తమ సంగీత దర్శకులు- కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
2013 అవార్డుల వివరాలు
* ఉత్తమ చిత్రం- మిర్చి
* రెండో ఉత్తమ చిత్రం- నా బంగారు తల్లి
* మూడో ఉత్తమ చిత్రం- ఉయ్యాల జంపాల
* ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- అత్తారింటికి దారేది
* ఉత్తమ కుటుంబ కథా చిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
* ఉత్తమ కథానాయకుడు- ప్రభాస్‌(మిర్చి)
* ఉత్తమ కథానాయిక- అంజలి(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
* ఉత్తమ దర్శకుడు- దయా కొడవగంటి
* ఉత్తమ సహాయనటుడు- ప్రకాశ్‌రాజ్‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు